RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Monday, November 5, 2012

సత్యవోలు సుందర సాయి 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకావిష్కరణ 

సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత సత్యవోలు సుందర సాయి రచించిన 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకాన్నిరవీంద్ర భారతి లో 'కిన్నెర ఆర్ట్ థియేటర్స్' ఆధ్వర్యం లో  జరిగిన కార్యక్రమం లో  రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా దారు కే.వి.రమణా చారి ఆవిష్కరించారు.అధికారి ప్రజల ఆశల రూపం గా వుండాలని , స్వార్ధం,అహంకారం,విభజన సూత్రం పాటించే వారైతే ప్రజలకు సేవ చెయ్యలేరని,అదే సుందర సాయి రచనల్లో కనిపిస్తుందని  -రమణా చారి అన్నారు. డా "యన్.గోపి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో 'యస్.వి.బీ.సి'   సి.ఈ.ఓ పాలకుర్తిమదుసూధన రావు, 'దూర దర్శన్ -సప్తగిరి' సంచాలకులు మల్లాది శైలజ సుమన్, రచయితలు  జీడిగుంట రామచంద్ర మూర్తి ,ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment