RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, November 1, 2014

జీవితంలో రాజీ పడలేదు... పడను కూడా !

సంపాదనలో నంబర్ ఒన్ నటి అనుష్కనే!

నా జీవితం తెరిచిన పుస్తకం కానుంది!

అతను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి !

మీకేమైనా సందేహం ఉంటే- ఆ సినిమా చూడండి!

అతని విషయంలోనూ వేలెత్తి చూపలేను!

జోడీ బాగుంటేనే ఆ సినిమా భారీ హిట్ !

జోడీ బాగుంటేనే ఆ సినిమా భారీ హిట్ !

హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కే పారితోషికాలు తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. బెంగాలీ బ్యూటీ బిపాసా బసు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పకుంది. పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో మార్పు సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. దీని గురించి ఆలోచించడం కూడా వృథాయేనంటూ కుండబద్దలు కొట్టింది. సల్మాన్ ఖాన్ వంటి హీరోకు కత్రినా వంటి హీరోయిన్ జోడీగా ఉంటేనే ఆ సినిమా భారీ హిట్ కొట్టే అవకాశముంటుందని, అయినా పారితోషికాల్లో మాత్రం తేడాలు ఉంటాయని చెప్పింది.

 దీని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదీ లేదంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పాత్రల విషయంలో మాత్రం సానుకూల మార్పులు వస్తున్నాయని, కథానాయికలకు కూడా సత్తా ఉన్నవి దొరుకుతున్నాయని చెప్పింది.‘మాకు పరిశ్రమలో మంచిస్థానం దొరుకుతోంది. ఇదివరకైతే ఆడిపాడడానికే హీరోయిన్లు పరిమితమయ్యే వాళ్లు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు మహిళలకూ వస్తున్నాయి. అన్ని వయసుల మహిళా నటులకు కూడా ఆసక్తికర పాత్రలు దొరుకుతున్నాయి’ అని చెప్పిన బిప్స్ 2001 నుంచి బాలీవుడ్‌లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ బ్యూటీ తాజా సినిమా' క్రిచర్ 'త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.అంతేకాదు దీనిని 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన 'బాబీ జాసూస్' వంటి మహిళల ఆధారిత చిత్రాల కథలు ఎంతో బాగున్నాయని ప్రశంసించింది. అయితే బిప్స్ తాజాగా నటించిన 'షమ్‌షకల్స్' బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అంతేగాక ఇందులో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే కాదు.. బిప్స్ కంటే చాలా జూనియర్ అయిన తమన్నాకు ప్రధాన హీరోయిన్ పాత్ర ఇచ్చారు. దీంతో బిపాసా బసు సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించలేదు.

నేను సిగ్గుతో తలవంచుకున్నాను!

నేను సిగ్గుతో తలవంచుకున్నాను!

కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు.

తన కుమారుడు జాయ్ సీ చేసిన నిర్వాకం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హాలీవుడ్ నటుడు, చైనా కుంగుఫూ స్టార్ జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్  నివాసంలో ఆయన కుమారుడు డ్రగ్స్ తో ఆగస్టు 14 తేదిన పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చైనాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జాకీ చాన్ గతంలో ప్రచారం నిర్వహించారు.

మొదటిసారి ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ఎంతో ప్రజాదరణ కలిగిఉన్న నేను సిగ్గుతో తలవంచుకున్నాను. విషాదంలో మునిగిపోయాను అంటూ ఓ వెబ్ సైట్ కు తెలిపారు. జాయ్ సీ తల్లి దుఖంలో మునిగిపోయారని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ చేసిన తప్పు తెలుసుకుని యువతరం మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నానని జాకీ చాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జాయ్ సీ చాన్  ప్రజలకు క్షమాపణలు
మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. మత్తు పదార్థాల కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే 'ఎమ్ స్టోన్స్'  క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు.

తొలిసారి ఈ పాట కు చాలా ఇబ్బందిపడ్డా!

తొలిసారి ఈ పాట కు చాలా ఇబ్బందిపడ్డా!

నా కెరీర్‌లో ఇంత వరకు ఏ సినిమాలోనూ నటించడానికి ఇబ్బంది పడలేదు. కానీ తొలిసారి 'మీగమన్' అనే తమిళ చిత్రంలోని ఓ పాట చేయడానికి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది అని తెలిపింది హన్సిక. తెలుగులో ప్రస్తుతం పవర్ చిత్రంలో నటిస్తున్న ఈ సుందరి తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా వుంది. ఈ సందర్భంగా హన్సిక మరిన్ని వివరాలు తెలియజేస్తూ తమిళంలో ఆర్య హీరోగా దర్శకుడు మగిళ తిరుమేని 'మీగమన్' చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటలో అయిష్టంగానే నటించాల్సి వచ్చింది.

పాటలోని కొన్ని సన్నివేశాల్లో మోతాదుకు మించి ఎక్స్‌పోజింగ్ చేయాలన్నారు. అలాగైతే ఇందులో నటించడం నా వల్ల కాదని దర్శకుడితో చెప్పేశాను. అయితే పాటలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. నన్ను నమ్ము. ఈ విషయంలో నాదీ పూచీ -అని దర్శకుడు నన్ను ఒప్పించారు. ఆయన ఎంత చెప్పినా చివరికి అయిష్టంగానే పాటలో నటించాను. ఇకపై ఎవరు ఎంత బలవంతపెట్టినా నా మనస్సాక్షికి విరుద్ధంగా అసభ్యకర సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.

అందుకనే హన్సిక ఎగ్గొట్టింది!
ఈ చిత్ర ప్రచారానికి నిర్మాత ఆహ్వానించినా నటి హన్సిక రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్య, హన్సిక జంటగా నటించిన చిత్రం మరియాన్ మిగమాన్'. నెమిచంద్ జపక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వి.హిదేశ్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాగిళ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. తడయరతాక్క చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.సతీష్‌కుమార్ చాయాగ్రహణం నెరుపుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ చెన్నైలో ఒక ఎఫ్‌ఎం రేడియో సంస్థ కార్యాలయంలో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మగిళ్ తిరుమేణి మాట్లాడుతూ- ఇది కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్న వైవిద్యభరిత కథా చిత్రం అని తెలిపారు.

నటుడు ఆర్యను దృష్టిలో పెట్టుకుని చిత్ర కథను తయారు చేయకున్నా ఆయన పాత్ర పోషణ చూసిన తరువాత మిగమాన్ చిత్రం హీరో పాత్రకు ఆర్యనే కరెక్ట్ అనిపించిందన్నారు. అదేవిధంగా హీరోయిన్ పాత్రకు నటి హన్సిక తన ఆలోచనలోనే లేదన్నారు. ముంబాయి నుంచి కొత్త హీరోయిన్‌ను పరిచయం చేద్దామనుకున్నానన్నారు. అయితే నిర్మాత హన్సికనే తమ చిత్ర హీరోయిన్ కావాలని, పట్టుబట్టి ఆమెతో మాట్లాడినట్లు చెప్పారన్నారు. దీంతో హన్సికను కలిసి కథ వినిపించగా మరో మాటలేకుండా వెంటనే తానీ చిత్రం చేస్తున్నానని చెప్పారన్నారు. ఆమె నటన ఈ చిత్రంలో ప్రశంసలందుకుంటుందన్నారు.ఈ కార్యక్రమానికి హన్సిక రాలేదేమన్న విలేకర్ల ప్రశ్నకు ఆర్య కల్పించుకుని- అలాంటి వ్యవహారాలన్నీ నిర్మాతనే చూసుకుంటున్నారని బదులిచ్చారు. నిర్మాత పిలిచినా ఆమె రాలేదని ఈ సారి తాను ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని నవ్వుతూ చెప్పారు.

ఒక్క సక్సెస్‌... మూడు సూపర్‌ ఛాన్సులు !

ఒక్క సక్సెస్‌... మూడు సూపర్‌ ఛాన్సులు !

ఓవర్‌నైట్‌ జీవితం మారిపోవడం అంటే అదే మరి! బాలీవుడ్ హాట్‌గాళ్‌, శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కెరీర్‌ని చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమై పోతుంది. నిన్నటివరకూ సినిమాల్లేక క్యాట్‌వాక్ లకే పరిమితమైన ఈ అమ్మడు వచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్‌ రేంజ్‌ కి పెరిగిపోయింది .  సల్మాన్‌ఖాన్‌ సరసన ఈ అమ్మడు `కిక్‌'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో సల్మాన్‌ భాయ్‌ స్టంట్స్  ఎంత పేరొచ్చిందో ?జాక్విలిన్‌ గ్లామర్‌కి, నటనకి అంతే పేరొచ్చింది. దాంతో ఇప్పుడు అమ్మడి ఇంటి ముందు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని సమాచారం. ఇప్పటికే 'రాయ్‌' అనే సినిమాలో అవకాశం అందుకుంది. హృతిక్‌రోషన్‌ సరసన ఛాన్స్  అందుకుంది. అదేగాక అక్షయ్‌కుమార్‌ సరసన ఓ సినిమాకి సంతకం చేసి బాలీవుడ్ లో 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌' అయ్యింది. 'వారియర్‌' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కరణ్‌జోహార్‌ దర్శకత్వం వహిస్తు న్నారు. ఒక్క సక్సెస్‌. మూడు సూపర్‌ ఛాన్సులిచ్చింది. అందుకే 'ఎవిరి డాగ్‌ హాజ్‌ ఎ డే' అని అంటుంటారు. ఈరోజు జాక్విలిన్‌ వంతు వచ్చింది. నిన్నటివరకూ కేవలం దీపిక, సోనాక్షి, కత్రిన అంటూ చదువుకున్నాం. ఇక నుంచి జాక్విలిన్‌ పేరు కూడా ఈ వరుసలో చేరిపోయినట్టేనన్న మాట!

అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందం!

అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందం!

యాక్షన్, కామెడీ పాత్రలతోపాటు అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందంగా ఉంటుంద’ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. సినిమాల్లో విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నాడు. ‘సినిమాలో అందరికంటే ఎక్కువ సేపు కనిపించేది విలనే.. హీరోయిన్ వెనుక ఎక్కువ తిరిగే ఛాన్స్ హీరోకన్నా విలన్‌కే ఉంటుంది..హీరోకు తన చెల్లి, తల్లి కోసం కష్టపడటం, వారిని రక్షించుకోవడంతోనే సమయం అంతా గడిచిపోతుంది.. కాకపోతే విలన్ చివరి ఐదు నిమిషాలు హీరో చేతిలో దెబ్బలు తింటాడు అంతే..’ అంటూ విలన్ పాత్ర తనకు ఎందుకు ఇష్టమో ఈ సూపర్ హీరో చెప్పుకొచ్చాడు.

 తన రాబోయే సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడాడు.  అక్షయ్‌కు మంచి కామెడీ, యాక్షన్ హీరోగా పేరుంది. కాగా, కామెడీ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అక్షయ్ చెప్పాడు. హాస్యంలో పలు రకాలున్నాయని, వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నాడు. కాగా, ప్రకాష్ రాజ్ చేసే కామెడీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆతరహా హాస్యం పండించడానికి కష్టపడతానని చెప్పాడు. తన 27 యేళ్ల సినీ ప్రస్థానంపై అతడు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ‘ఈ రోజుకీ నేను ఉదయం లేవగానే షూటింగ్‌కు వెళ్లేందుకు చాలా ఉత్సుకత చూపిస్తాను ఈ వృత్తి నాకు చాలా బాగా నచ్చింది.. మున్ముందు కూడా నా వృత్తిపట్ల అంకిత భావంతోనే పనిచేస్తా’నన్నాడు. ఒక జీవితకాలంలో అనేక పాత్రలను పోషించగలిగే అవకాశమున్న ఏకైక వృత్తి నటన అని ఆయన వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశా.. వాటిలో వివిధ పాత్రలను పోషించా.. నటనా వృత్తిలో మనం ఎంతోమంది అమ్మాయిలతో రొమాన్స్ చేయవచ్చు (నవ్వుతూ..) ఎన్నో ఆటలు ఆడొచ్చు.. పోలీస్ ఆఫీసర్ అవ్వొచ్చు.. విలన్‌గా మారొచ్చు.. ఏ పాత్ర చేసినా డబ్బులు మాత్రం వస్తాయి.. అందుకే ఈ వృత్తి అంటే నాకు ప్రాణం..’ అంటూ నవ్వుతూ ముక్తాయించాడు.

నాయకురాలైన సినీ తార గా ప్రియాంక


నాయకురాలైన సినీ తార గా ప్రియాంక

బాలీవుడ్‌లో వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో ప్రియాంకచోప్రా ఒకరు. ప్రతి చిత్రంలో పాత్రపరంగా కొత్తదనాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతుందామె. ప్రస్తుతం భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న మేరీకోమ్ చిత్రంతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది ప్రియాంకచోప్రా.
ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె ఇటీవలే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మేడమ్‌జీ' చిత్రానికి ఓకే చెప్పింది. ఐటెంగర్ల్ స్థాయి నుంచి దేశరాజకీయాలను శాసించే నాయకురాలిగా ఎదిగిన ఓ సినిమా తార జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సన్నివేశాల పరంగా ఈ సినిమా స్క్రిప్ట్ తొలి భాగంలో దర్శకుడు మధుర్ బండార్కర్ శృంగార సన్నివేశాలకు ఎక్కువగా చోటుకల్పించినట్లు తెలిసింది. ఇటీవలే చిత్ర కథను విన్న ప్రియాంకచోప్రా ఈ సన్నివేశాలను పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేసిందని, వాటిని తగ్గించాల్సిందిగా మధుర్ బండార్కర్‌ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి మధుర్ బండార్కర్‌తో పాటు ప్రియాంకచోప్రా కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

మేం హార్డ్ వర్క్ తోనే సాధించి చూపించాం!

మేం హార్డ్ వర్క్ తోనే సాధించి చూపించాం!

ఎక్కడైనా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి తాజాగా మన బాలీవుడ్ అగ్రహీరోల విషయంలో మరోసారి రుజువైంది. గతంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ , కండల వీరుడు సల్మాన్ ఖాన్ లు  తమ  మధ్య చోటు చేసుకున్నవివాదానికి తెరదించే క్రమంలో పడ్డారు .  ఈ మధ్యనే 'కింగ్ ఆఫ్ ద బాలీవుడ్' ఎవరని విలేకర్లు అడిగిన ప్రశ్నకు- 'షారుఖ్ ఖాన్' అని సమాధానమిచ్చి సల్మాన్ తన విధేయతను చాటుకున్నాడు. అందుకు షారుఖ్ ఖాన్ కూడా సల్మాన్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.

తాజాగా సల్మాన్ వ్యాఖ్యలపై షారుఖ్ స్పందిస్తూ.. 'మేము ఇద్దరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు ఏమీ లేవు.మేము ఏమి సాధించినా హార్డ్ వర్క్ తోనే చేసి చూపించాం. దాంతోనే మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి' అని షారుఖ్ తెలిపాడు. తాము ఎప్పుట్నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్నామన్న సంగతిని బాద్ షా గుర్తు చేశాడు. అయినప్పటికీ ఇద్దరం ఎప్పుడూ ఒకర్నొకరు కించపరుచుకునే విధంగా ప్రవర్తించ లేదని తెలిపాడు.  మా ఇద్దరికీ నంబర్ గేమ్ పై అంతగా నమ్మకం లేదని తెలిపాడు. తాము ఎప్పుడూ మా తదుపరి సినిమాను ఎంత బాగా చేయాలని మాత్రమే ఆలోచిస్తామని షారుఖ్ తెలిపాడు.అంతకుముందు కూడా  తనకు, సల్మాన్ ఖాన్ కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని షారూఖ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆ లెటర్ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు !


                                      

ఆ  లెటర్ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు !

ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు వుంటాయి . కన్నీళ్లు పెట్టుకోవడానికి వారు వీరు అనే  తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. 'సింగమ్ రిటర్న్స్' విజయాన్ని ఆకాంక్షిస్తూ- తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట.

ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో  'సింగమ్ రిటర్న్స్'విడుదల  సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ- తన పాత  జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను'  అని లెటర్ లో తెలిపాడు.

ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్,  వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే.

తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు