'ది డర్టీ పిక్చర్' సినిమా విద్యాబాలన్లోని మరో కోణాన్ని చూపింది. అయితే ఆ సినిమా ఆమెలో మూఢనమ్మకాలనూ పెంచింది. ఆ చిత్రంలో ఎర్ర రంగు దుస్తులు ధరించి ప్రేక్షకులను మైమరిపించిన విద్యా ఎక్స్పోజింగ్ విషయంలో అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొంది. తన తాజా చిత్రం ‘ఫెర్రారీ కీ సవారీ’లో ఐటమ్ సాంగ్ చేస్తున్న విద్యా బాలన్ ఆ పాట కోసం ఎర్ర రంగు చీర కావాలని పట్టుబట్టిందట. ది డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో అదరగొట్టిన 33 ఏళ్ల విద్యా బాలన్ విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ వారి ‘ఫెర్రారీ కీ సవారీ’లో ‘మాలా జావు ద్యా నా ఘారీ’ అంటూ ఐటమ్ సాంగ్లో...
Tuesday, February 28, 2012
విద్యా బాలన్ ఎర్ర చీర కావాలని పట్టుబట్టిందట
'ది డర్టీ పిక్చర్' సినిమా విద్యాబాలన్లోని మరో కోణాన్ని చూపింది. అయితే ఆ సినిమా ఆమెలో మూఢనమ్మకాలనూ పెంచింది. ఆ చిత్రంలో ఎర్ర రంగు దుస్తులు ధరించి ప్రేక్షకులను మైమరిపించిన విద్యా ఎక్స్పోజింగ్ విషయంలో అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొంది. తన తాజా చిత్రం ‘ఫెర్రారీ కీ సవారీ’లో ఐటమ్ సాంగ్ చేస్తున్న విద్యా బాలన్ ఆ పాట కోసం ఎర్ర రంగు చీర కావాలని పట్టుబట్టిందట. ది డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో అదరగొట్టిన 33 ఏళ్ల విద్యా బాలన్ విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ వారి ‘ఫెర్రారీ కీ సవారీ’లో ‘మాలా జావు ద్యా నా ఘారీ’ అంటూ ఐటమ్ సాంగ్లో...
ఫీల్గుడ్ మూవీ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’...చిత్ర సమీక్ష...
Monday, February 20, 2012
ఆరు గ్రామీలు గెల్చిన అడెలే
శింబు, నయనతార మళ్లీ కలసి నటింప చేసే ప్రయత్నాలు
Saturday, February 18, 2012
ఇప్పనపల్లి హరికిషన్ కు సన్మానం
ఇప్పనపల్లి హరికిషన్ కు సన్మానం
ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రవాసాంధ్ర ప్రముఖులు ఇప్పనపల్లి హరికిషన్ ను ఇంటర్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ తెలుగు కల్చర్ -యువకళావాహిని సంస్థలు నిజం క్లబ్ లో సన్మానించాయి. సారిపల్లి కొండల రావు, బాపురెడ్డి , గజల్ శ్రీనివాస్, దీక్షిత్, సాయి చంద్, యం.వెంకటేశ్వర్లు, వై.కే.నాగేశ్వరరావు ,వి.కే.దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Friday, February 17, 2012
' నిప్పు' చిత్ర సమీక్ష 2.25/5
బొమ్మరిల్లు పతాకం ఫై గుణశేఖర్ దర్సకత్వం లో వై .వి.యస్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య - శ్రీ ప్రాణ మిత్రులు. శ్రీ పుట్టిన రోజు వేడుకల కోసం సూర్య మిత్ర బృందం సౌదీ అరేబియా వెళ్తుంది. అక్కడ శ్రీ ప్రేయసి వైష్ణవి ప్రమాదవశాత్తు చనిపోతుంది. అయితే ఆమెను శ్రీ హత్యచేసినట్లు భావించి అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ్రీ కి వురి శిక్ష విధిస్తారు. ఆ శిక్ష నుండి అతను తప్పించుకోవాలంటే చని పోయిన వైష్ణవి తల్లి దండ్రులు శ్రీ ని క్షమించినట్లు రాసివ్వాల్సి వుంటుంది. గూండా సామ్రాజ్యానికి నాయకుడైన వైష్ణవి తండ్రి రాజా గౌడ్ అరాచకాలను ఎదిరించి , అప్పటికే సూర్య అతనితో శత్రుత్వం కొనితెచ్చుకుని ఉంటాడు. అయినప్పటికీ మిత్రుడు శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య ప్రయత్నం ప్రారంభిస్తాడు. శ్రీ కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ,తను ప్రేమించిన శ్రీ చెల్లెలు మేఘన కు మాత్రమే సూర్య జరిగింది చెబుతాడు. రాజా గౌడ్ ను ప్రసన్నం చేసుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా పట్టు వదలని సూర్య తను అనుకున్నది ఎలా సాధించాడనేదే ఈ చిత్ర కధాంశం .
మాస్ చిత్రాల హీరో రవితేజ తో ఫ్లాప్ చిత్రాల దర్శకులు నిర్మించిన ఈ చిత్రం పట్ల మొదటి నుండీ అందరికి సందేహాలున్నాయి. చిత్రం చూసాక వారి సందేహాలే నిజమయ్యాయని అనిపిస్తుంది. రవి తేజ సినిమా అంటే పూర్తి వినోదాత్మకం గా వుండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈ చిత్రం లో వారు ఆశించినంత వినోదం లేకపోవడం తో పాటు, కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచింది. రౌడీ గ్యాంగులు ...వాళ్ళతో హీరో ఫైట్లు మనం చాలా సినిమాల్లో చూసినవే .వాటితోపాటు ఇందులో హీరో కంటైనర్ ఫై బైక్ నడపడం...గేటు ఫై నుండి బైక్ తో జంప్ చేయడం వంటి కనల్ కన్నన్ స్పెషల్ విన్యాసాలు కూడా చేసి చిరాకు కలిగించాడు. శ్రీ ప్రేయసి వైష్ణవి సౌదీ అరేబియాలో అన్ని అంతస్తుల భవంతి ఎక్కి మరీ ...పరుగెడుతూ పడి, ప్రాణాలు పోగొట్టుకోవడం నమ్మేవిధంగా లేదు. శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య చేసిన ప్రయత్నాలు కూడా సహజత్వానికి దూరంగా వున్నాయి. చాలా సినిమాలకి ప్రధాన ఆకర్షణ అయిన బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రం లో మాత్రం పెద్ద ఇబ్బంది గా మారింది. ఒక్కో పాట ఒక్కొక్కరితో రాయించినా, మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించినా... తమన్ సంగీతం లో పాటలు ఇంకాస్త బాగుంటే సినిమాకి ఉపకరించేవి. టి.వి 9 లో రాజా గౌడ్ ను పరిచయం చెయ్యడం, రెస్టారెంట్ లో ఫైట్ వంటివి బాగున్నాయి.
ఈ చిత్రం లో రవి తేజ ఒక్కడే ప్రధాన ఆకర్షణ . ఎప్పటిలానే శక్తివంతం గా సూర్య పాత్రకి న్యాయం చెయ్యడానికి కృషి చేసాడు. ఇటీవల చిత్రాల కన్నా అందం గా కూడా కనిపించాడు. దీక్షా సేథ్ విగ్రహం బాగున్నా
విషయం లో ఇంకా వెనుకబడే వుంది. శ్రీ పాత్రలో శ్రీరాం చిన్న పాత్ర బాగా చేసాడు.అతని ప్రేయసి వైష్ణవి గా భావన , మరో సన్నివేశం లో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారి కనిపించి వెళ్ళారు. శ్రీ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ బాగానే చేసినా ,అతన్నీ...కృష్ణుడిని బాగా వాడుకోలేదని అనిపిస్తుంది. లావు తగ్గిన భరత్ ని చూడ లేకపోయాము. ప్రదీప్ రావత్, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్, ధర్మవరపు, సి.వి.యల్, ప్రగతి, సురేఖ వాణి, వినయ్ వర్మ, గీతా సింగ్ , శకుంతలఈ చిత్రం లోని ఇతర పాత్రలు పోషించారు. శ్రీధర్ సీపాన సంభాషణలు, సర్వేష్ మురారి ఫోటో గ్రాఫి,
గౌతం రాజు ఎడిటింగ్ బాగున్నాయి -రాజేష్
షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ వివాదం
రాజకీయాల్లోకి జెనీలియా
Tuesday, February 14, 2012
అఖిల్ కు నటించాలని వుంది.... నాగార్జున చైనీస్ రెస్టారెంట్
టాప్ 50 హీరోయిన్లు, సెలెబ్రెటీలు, మోడల్స్
Sunday, February 12, 2012
'ఋషి'... 'ధోని '... ‘ఎస్ఎంఎస్’... ఇలా వున్నాయి
సమాజంలో విలన్లే సినిమాల్లో హీరోలు
Sunday, February 5, 2012
‘భట్టి విక్రమార్క’గా బాలకృష్ణ ?... జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్?
Saturday, February 4, 2012
కే .వి.రెడ్డి అవార్డ్ అందుకున్న కోదండరామిరెడ్డి
కే .వి.రెడ్డి అవార్డ్ అందుకున్న కోదండరామిరెడ్డి
'జగదేక దర్శకుడు' కే.వి.రెడ్డి అవార్డ్ తో పాతికేళ్ళుగా ప్రముఖ దర్శకులను గౌరవిస్తున్న ' యువకళావాహిని' కే. వి. రెడ్డి శత జయంతి సందర్భం గా కోదండరామిరెడ్డి ని ఈ అవార్డ్ తో సత్కరించింది. రవీంద్రభారతిలో ఫిబ్రవరి 3 న జరిగిన ఈ కార్యక్రమం లో అక్కినేని నాగేశ్వర్ రావు చేతుల మీదుగా కోదండరామిరెడ్డి ఈ అవార్డ్ స్వీకరించారు. కే.వి.రెడ్డి ప్రాణం పోసిన ప్రతి చిత్రం నవతరం దర్శకులు,నటులకు 'వేదం' వంటిది. కే.వి.రెడ్డి వంటి గొప్ప దర్సకులవల్లనే నటులు గొప్పవారయ్యారు. సమాజానికి మంచి-చెడులు చెప్పాలనే తపన తో కే.వి.రెడ్డి కధలు రాసుకునేవారు.ఆయన చిత్రాల్లో ' పోతన',' వేమన', 'మాయా బజార్' లాంటి చిత్రాలు ఒక పార్శమైతే ...'దొంగ రాముడు', 'పెద్దమనుషులు', 'పెళ్లినాటి ప్రమాణాలు' మరో కోణం. పురాణాల ఫై మోజు, దర్శకత్వ శాఖ ఫై పూర్తి పట్టు, సామాజిక స్పృహ ఉన్న గొప్ప దర్శకుడు కే.వి.రెడ్డి -అని అక్కినేని అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ- సినిమా చరిత్ర వున్నంతకాలం కే.వి.రెడ్డి రూపొందించిన 'మాయా బజార్','పాతాళ భైరవి' చిత్రాలు వుంటాయి-అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ-చిత్ర పరిశ్రమ నిర్వహించాల్సి ఇటువంటి కార్యక్రమాలను ' యువకళావాహిని' వంటి సాంస్కృతిక సంస్థలు నిర్వహించడం అభినందనీయం- అనిఅన్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- స్వర్ణయుగపు దర్శకుల క్రమశిక్షణ పుణికిపుచ్చుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి -అని అన్నారు. మహా దర్శకుడు కే.వి.రెడ్డి అవార్డును అక్కినేని చేతులమీదుగా అందుకోవడం చాలా ఆనందం గా వుందని- కోదండరామిరెడ్డి తనకుజరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెప్పారు. జర్నలిస్టులు వాసిరాజు ప్రకాశం, ఏ .రాంబాబు, 'లయన్స్' పీ .జయప్రకాష్ రెడ్డి, జి.హనుమంతరావు, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు కే.వి.రెడ్డి అవార్డ్ ను ఎంపికచేశారు. ఏ. వి.యస్ ,జయలలిత, ' కార్నేషన్' రాం , రాచమల్లు ఇస్మాయిల్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కే.వి.రెడ్డి-కోదండరామిరెడ్డిల ' సిని సంగీత విభావరి' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'జగదేక దర్శకుడు' కే.వి.రెడ్డి అవార్డ్ తో పాతికేళ్ళుగా ప్రముఖ దర్శకులను గౌరవిస్తున్న ' యువకళావాహిని' కే. వి. రెడ్డి శత జయంతి సందర్భం గా కోదండరామిరెడ్డి ని ఈ అవార్డ్ తో సత్కరించింది. రవీంద్రభారతిలో ఫిబ్రవరి 3 న జరిగిన ఈ కార్యక్రమం లో అక్కినేని నాగేశ్వర్ రావు చేతుల మీదుగా కోదండరామిరెడ్డి ఈ అవార్డ్ స్వీకరించారు. కే.వి.రెడ్డి ప్రాణం పోసిన ప్రతి చిత్రం నవతరం దర్శకులు,నటులకు 'వేదం' వంటిది. కే.వి.రెడ్డి వంటి గొప్ప దర్సకులవల్లనే నటులు గొప్పవారయ్యారు. సమాజానికి మంచి-చెడులు చెప్పాలనే తపన తో కే.వి.రెడ్డి కధలు రాసుకునేవారు.ఆయన చిత్రాల్లో ' పోతన',' వేమన', 'మాయా బజార్' లాంటి చిత్రాలు ఒక పార్శమైతే ...'దొంగ రాముడు', 'పెద్దమనుషులు', 'పెళ్లినాటి ప్రమాణాలు' మరో కోణం. పురాణాల ఫై మోజు, దర్శకత్వ శాఖ ఫై పూర్తి పట్టు, సామాజిక స్పృహ ఉన్న గొప్ప దర్శకుడు కే.వి.రెడ్డి -అని అక్కినేని అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ- సినిమా చరిత్ర వున్నంతకాలం కే.వి.రెడ్డి రూపొందించిన 'మాయా బజార్','పాతాళ భైరవి' చిత్రాలు వుంటాయి-అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ-చిత్ర పరిశ్రమ నిర్వహించాల్సి ఇటువంటి కార్యక్రమాలను ' యువకళావాహిని' వంటి సాంస్కృతిక సంస్థలు నిర్వహించడం అభినందనీయం- అనిఅన్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- స్వర్ణయుగపు దర్శకుల క్రమశిక్షణ పుణికిపుచ్చుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి -అని అన్నారు. మహా దర్శకుడు కే.వి.రెడ్డి అవార్డును అక్కినేని చేతులమీదుగా అందుకోవడం చాలా ఆనందం గా వుందని- కోదండరామిరెడ్డి తనకుజరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెప్పారు. జర్నలిస్టులు వాసిరాజు ప్రకాశం, ఏ .రాంబాబు, 'లయన్స్' పీ .జయప్రకాష్ రెడ్డి, జి.హనుమంతరావు, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు కే.వి.రెడ్డి అవార్డ్ ను ఎంపికచేశారు. ఏ. వి.యస్ ,జయలలిత, ' కార్నేషన్' రాం , రాచమల్లు ఇస్మాయిల్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కే.వి.రెడ్డి-కోదండరామిరెడ్డిల ' సిని సంగీత విభావరి' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.