RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, November 21, 2012

'ప్రయోగం' దర్శకుడు భానుప్రకాష్ కు సత్కారం


'ప్రయోగం' చిత్రానికి 'తొలి చిత్ర ఉత్తమ దర్శకుడు' నంది అవార్డు పొందిన  భానుప్రకాష్ కు 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు  ఆధ్వర్యం లో రవీంద్ర భారతి లో  అభినందన  సత్కారం జరిగింది.సారిపల్లి కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో   నటులు రంగనాద్ మాట్లాడుతూ - సినిమాని 4 ఫ్రేముల్లో చెప్పడం ద్వారా భానుప్రకాష్  'దర్శకావధాని' అనిపించుకున్నారు.ఈ చిత్ర నిర్మాణం లో ఎన్ని కష్ట  నష్టాలు వచ్చినా, తొలి చిత్రానికే నంది అవార్డ్ స్వంతం చేసుకున్నారని-అన్నారు. సాయి చంద్  మాట్లాడుతూ-అనుభవగ్యులైన  పాత దర్శకులే చెయ్యలేని పని , తొలి చిత్రంలోనే భాను ప్రకాష్ చేసి చూపించాడని అన్నారు. ఆర్ .పీ.పట్నాయక్ మాట్లాడుతూ-సినిమాని 4 ఫ్రేముల్లో చూపించిన భాను, మనిషిలోని 4 రకాల స్వభావాలను చూపే చిత్రాన్ని కూడా చెయ్యాలని అన్నారు.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ-కష్ట సాధ్యమైన ఈ చిత్రాన్ని ఎంతో శ్రమించి, పక్కా ప్రణాళికతో భాను తెరకెక్కించారని అన్నారు. డా"కే.వి.కృష్ణ కుమారి మాట్లాడుతూ-పెద్ద చిత్రాలు ప్రేక్షకులను మత్తులో ముంచుతుంటే,యువత మత్తు లోంచి బయట పడాలని  చెప్పే చిత్రాన్ని నిర్మించిన భాను ప్రకాష్ ఎంతైనా అభినందనీయుడని  అన్నారు.

0 comments:

Post a Comment