Thursday, January 31, 2013
Saturday, January 26, 2013
Friday, January 25, 2013
'కె.వి.రెడ్డి అవార్డు' ను అందుకున్న బి.గోపాల్
'కె.వి.రెడ్డి అవార్డు' ను అందుకున్న బి.గోపాల్
విఖ్యాత దర్శకుడు 'కె.వి.రెడ్డి అవార్డు' ప్రదానోత్సవం 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 24న రవీంద్రభారతిలో ఉల్లాసభరితంగా జరిగింది. ఈ అవార్డును డా"అక్కినేని నాగేశ్వరరావు, కె.విశ్వనాధ్,డి.రామానాయుడుల చేతులమీదుగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కు ప్రదానం చేశారు. కె.వి. రెడ్డి చలనచిత్ర పరిశ్రమ మరిచిపోలేని గొప్ప వ్యక్తని, అంతకంటే గొప్ప దర్శకుడని చెబుతూ - ప్రేక్షకులను రంజింపజేసే పకడ్బందీ కధనం(స్క్రీన్ ప్లే)అందించడం లో కె.వి.రెడ్డి దిట్ట -అని డా"అక్కినేని కొనియాడారు.పరుచూరి సోదరుల గురించి అక్కినేని విసిరిన ఛలోక్తులు నవ్వులు పూయించాయి.
డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- బి.గోపాల్ తమ సంస్థకు బిడ్డలాంటి వాడని అన్నారు.ఈ ఏడాది తను దర్శకత్వం వహిస్తానని చెప్పారు. బి.గోపాల్ మాట్లాడుతూ- థియేటర్లో నేలపై కూర్చొని అక్కినేని సినిమాలు చూసిన తాను ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవటం నమ్మలేనంత ఆనందంగా ఉందన్నారు. రామానాయుడు దర్శకుడిగా అవకాశం ఇవ్వకుంటే తాను ఈ స్థితిలో వుండే వాడిని కాదని,ఈ అవార్డును రామానాయుడుకే అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ సభలో పరుచూరి సోదరులు, సారిపల్లి కొండల రావు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్,నిర్మాత యస్.గోపాల్ రెడ్డి, నిర్మాత డా"వెంకటేశ్వరరావు, 'జాతీయ అవార్డు గ్రహీత' వాసిరాజు ప్రకాశం, 'సినీ వినోదం.కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల , వై.కె.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గంగాధర్,విజయలక్ష్మి ,చింతలపాటి సురేష్ ల 'కె.వి.రెడ్డి సినీ సంగీత విభావరి' ఆహుతులను ఆకట్టుకుంది.
విఖ్యాత దర్శకుడు 'కె.వి.రెడ్డి అవార్డు' ప్రదానోత్సవం 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 24న రవీంద్రభారతిలో ఉల్లాసభరితంగా జరిగింది. ఈ అవార్డును డా"అక్కినేని నాగేశ్వరరావు, కె.విశ్వనాధ్,డి.రామానాయుడుల చేతులమీదుగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కు ప్రదానం చేశారు. కె.వి. రెడ్డి చలనచిత్ర పరిశ్రమ మరిచిపోలేని గొప్ప వ్యక్తని, అంతకంటే గొప్ప దర్శకుడని చెబుతూ - ప్రేక్షకులను రంజింపజేసే పకడ్బందీ కధనం(స్క్రీన్ ప్లే)అందించడం లో కె.వి.రెడ్డి దిట్ట -అని డా"అక్కినేని కొనియాడారు.పరుచూరి సోదరుల గురించి అక్కినేని విసిరిన ఛలోక్తులు నవ్వులు పూయించాయి.
డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- బి.గోపాల్ తమ సంస్థకు బిడ్డలాంటి వాడని అన్నారు.ఈ ఏడాది తను దర్శకత్వం వహిస్తానని చెప్పారు. బి.గోపాల్ మాట్లాడుతూ- థియేటర్లో నేలపై కూర్చొని అక్కినేని సినిమాలు చూసిన తాను ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవటం నమ్మలేనంత ఆనందంగా ఉందన్నారు. రామానాయుడు దర్శకుడిగా అవకాశం ఇవ్వకుంటే తాను ఈ స్థితిలో వుండే వాడిని కాదని,ఈ అవార్డును రామానాయుడుకే అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ సభలో పరుచూరి సోదరులు, సారిపల్లి కొండల రావు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్,నిర్మాత యస్.గోపాల్ రెడ్డి, నిర్మాత డా"వెంకటేశ్వరరావు, 'జాతీయ అవార్డు గ్రహీత' వాసిరాజు ప్రకాశం, 'సినీ వినోదం.కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల , వై.కె.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గంగాధర్,విజయలక్ష్మి ,చింతలపాటి సురేష్ ల 'కె.వి.రెడ్డి సినీ సంగీత విభావరి' ఆహుతులను ఆకట్టుకుంది.
Thursday, January 24, 2013
Wednesday, January 23, 2013
విక్రమ్ స్టైల్ నాకిష్టం!:అమలాపాల్
ఇక డిటిహెచ్లో చిన్న సినిమాలు ?
Tuesday, January 22, 2013
'బిగ్ బాస్' విజేత ఊర్వశి ధోలకియా
Friday, January 18, 2013
వివేకానంద జయంతి ఉత్సవంలో జాగృతి పురస్కారాలు
'యువకళా వాహిని' ఆధ్వర్యం లోజనవరి 11న జరిగిన వివేకానంద జయంతి ఉత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు,జే .బాపురెడ్డి చేతులమీదుగా జాగృతి పురస్కారాలు అందుకుంటున్న జి .సత్య వాణి, ఇప్పన పల్లి హరికిషన్, పి .మంజుల , కే.వెంకట రమణ మూర్తి. ఈ కార్యక్రమం లో 'వివేకానంద విజయం' పాటల సి.డి ని విడుదల చేసి, వై.కే.నాగేశ్వర్ రావు బృందం చే 'స్వామి వివేకానంద' నాటకాన్ని ప్రదర్శించారు.
Monday, January 14, 2013
విధి నిర్ణయంతోనే సినిమాల్లోకి
'సదా బహార్ నగ్మే' సినీగీత విభావరి
మహతి మ్యూజిక్ - శ్రీ నాగ రంజని లలిత సంగీత అకాడమీ ఆధ్వర్యం లో జనవరి 5న రవీంద్ర భారతి లో 'సదా బహార్ నగ్మే'( హిందీ చలన చిత్ర ఆపాత మధురాలు) సినీగీత విభావరి జరిగింది.మూడు దశాబ్దాల హిందీ చలన చిత్ర స్వర్ణయుగం (1950-1980)లోని జన రంజకమైన "జ్యోతి కలష్ ఛల్ కే ", "తేరే మేరె సప్నే", "బయ్య నాదరో", "గుమ్ నామ్ హాయ్ కోయి", "మేరే సప్నోంకి రాణి", "ఓ మేరే సోనారే ", "ధీరె ధీరె మచల్", "రైనా బీత్ జాయే" వంటి ఎంపిక చేసిన గీతాలను ఆలపించి పాత పాటల తీయదనాన్ని అందించారు.లతా మంగేష్కర్,ఆషా భోంస్లే ,మన్నాడే,రఫీ,కిషోర్ కుమార్,జేసుదాస్,సుమన్ కళ్యాణ్ పూర్ వంటి మహా గాయకులు నాడు ఆలపించిన గీతాలను డా"చిత్తరంజన్, డా"యం.విజయకుమార్ ,మురళి,కౌశిక్,విజయ లక్ష్మీ దేశికన్,వందన పవన్,మహతి రాఘవన్, అమృత వల్లి ఆనంద్ తదితరులు ఆలపించి ప్రేక్షకులను పులకరింప జేసారు.ఈ కార్యక్రమం లో పాడిన వారంతా మహాభాష్యం కుటుంబ సభ్యులే కావడం విశేషం.ఈ కార్య క్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత్ ,మహేంద్ర సత్యం సీనియర్ ఉపాధ్యక్షులు శివానంద తనేజ ముఖ్య అతిధులుగా హాజరై గాయనీ గాయకులను అభినందించారు.'సంగీత్ సాగర్' అశోక్ బృందం వారు వాద్య సహకారం అందించారు.సినీ గీత చిత్రీకరణలను వీడియో స్క్రీన్ ద్వారా రఘురామ్ ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఈ కార్యక్రమాన్ని సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శులు రాఘవ దేశికన్,డా"యం.విజయ కుమార్ రసవత్తరం గా నిర్వహించారు.