RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, April 27, 2012

'దమ్ము' చిత్ర సమీక్ష

 'దమ్ము' చిత్ర సమీక్ష                      2.5/5

సి.సి.మీడియా -ఎంటర్ టైన్మెంట్ పతాకం ఫై కే.యస్.రామారావు సమర్పణ లో బోయపాటి శ్రీను దర్శకత్వం లో కే.ఏ . వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనాధగా , ఆర్ధికంగా అతిజాగ్రత్తగా నగరం లో బతుకుతున్న విజయ్ సత్య ప్రేమలో పడతాడు. తమది' రాజ కుటుంభం' అని ఆమెకు  అబద్ధం చెప్పిన విజయ్ ఒక సంస్థాన రాజ కుటుంభం వారు తనని దత్తత తీసుకుంటారంటే అంగీకరిస్తాడు. అక్కడికి వెళ్ళిన విజయ్ కి  ఆ సంస్థానానికి, సమీపంలో ఉన్న మరో సంస్థానానికి మధ్య చిరకాలం గా విరోధం ఉన్న విషయం  తెలుస్తుంది. ఆ కక్షలు-హత్యల మధ్య ఉండలేక వెళ్ళిపోదామనుకున్న విజయ్ ప్రత్యర్ధి నాజర్  సంస్థానం వారు సాగిస్తున్న దమన కాండను చూసి వెనక్కి వచ్చి వారికి గుణ పాఠం చెబుతాడు. విజయ్ ని  నాజర్ దురాగతాలను అడ్డుకోవడానికి పాతికేళ్ళకు   వచ్చిన యువరాజు ' శ్రీ సింహ' గా ఆ సంస్థానం వారు జేజేలు పలుకుతారు.  ప్రతీకార వాంచతో ఉన్న నాజర్ మనుషులు విజయ్ కాబోయే బావను చంపి,   హింసను వ్యతిరేకించే విజయ్ ని హింసా మార్గానికి మళ్ళిస్తారు. ఆ తర్వాత విజయ్ యువరాజు ' శ్రీ సింహ' కాదనే విషయం తెలిసి పోతుంది. ఇక మిగతా కధ సినిమాలో చూడాలి ...

యాక్షన్- వయలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చే బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఫ్యాక్షన్ చిత్రాల స్పెషలిస్టు నందమూరి హీరో యన్. టి. ఆర్ తో నిర్మించిన ఈ భారీ చిత్రం గతం లో వచ్చిన యన్. టి. ఆర్ 'ఆది','సింహాద్రి' చిత్రాల ను, బోయపాటి 'సింహా' ను చాలా చోట్ల గుర్తు చేస్తుంది. హీరోను వీరోచితం గా చూపడానికి అరిగి పోయిన ఫ్యాక్షన్ చిత్రాల బాటను ఎంపిక చేసుకోవడం లోనే దర్శకుడు తప్పు చేసాడు.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగా పండినా...గతం లో మనం చాలా సార్లు చూసిన రొటీన్ సన్నివేశాలే కావడంతో  చిత్రం లో కొత్తదనం కరువయ్యింది.అంతా రొటీన్ ఫార్ములతోనే నడుస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్- వయలెన్స్ మోతాదు మించింది.సినిమాలో సగం దీనికే కేటాయించారు.సందర్భ బలం లేకుండా పది సినిమాల్లో పెట్టాల్సిన భారీ డైలాగులు ఈ ఒక్క సినిమాలోనే పెట్టేసారని అనిపిస్తుంది. దానికి బోనస్ గా ద్వందార్ధాలు కూడా ఎక్కువ మోతాదులోనే కలిపినా ప్రేక్షకులు  ఆనంద పడక పోగా  ...హింసగా  ఫీలవుతున్నారు. ఇద్దరు హీరోయిన్ ల తో' ఏ' టైపు పాట పెట్టినా తనివి తీరక, నలుగురితో మరోపాట పెట్టి తమ కళా ప్రతిభను  ప్రదర్శించారు.ఇంట్లోనే అజ్ఞాతవాసం ఉన్న సుమన్ పాతికేళ్ళ తర్వాత బయటికి రావడం, తరాలుగా వైరం ఉన్న నాజర్ క్లైమాక్స్ లో ప్రత్యర్ధి హీరో ను పొగుడుతూ ఉపన్యాసం  ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా వుంది.

విజయ్ గా, శ్రీసింహ గా యన్.టి ఆర్ నటన ను ఈ సినిమాలో ప్రత్యేకత. పాటలు-ఫైట్లు- డైలాగ్ డెలివరి లోను  చాలా బాగాచేసాడు. సత్య  గా త్రిష- నీల  గా  కార్తీక గ్లామర్ కోసమే కనిపిస్తారు. అలీ-బ్రహ్మానందం కామెడీ కూడా అంతంతమాత్రమే . హీరో వేణు ఈ చిత్రం లోయన్.టి ఆర్ బావ గా ఒక పాత్ర పోషించడం విశేషం. ఇందులో ఇతర పాత్రల్లో సుమన్,నాజర్,కోట,అశోక్ కుమార్, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి,భానుప్రియ,చలపతిరావు,అభి
నయ,ప్రవీణ,శ్రీధర్, సంపత్ రాజ్,రాహుల్ దేవ్, కిషోర్ పోషించారు.  సంభాషణల రచయితగా రత్నం తన పనితనం ప్రేక్షకులకు మరో సారి రుచి చూపించాడు. యన్.టి ఆర్   రాజకీయ దృక్పధాన్ని  కూడా అక్కడక్కడా చూపించాడు. ఆర్ధర్ విల్సన్ ఫోటో గ్రఫీ ,కోటగిరి ఎడిటింగ్, ఆనంద్ సాయి కళ  , రాం -లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     -రాజేష్




Saturday, April 14, 2012

వీర్యదాత గా టీవీ ప్రెజెంటర్ ఆయుష్మాన్ ఖురానా


టీవీ ప్రెజెంటర్ ఆయుష్మాన్ ఖురానా చిరకాల వాంఛ తీరింది. ఒక కొత్త తరహా సినిమా' వికీ డోనర్‌'లో అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో వీర్యదాత గా కనిపిస్తాడు. కాస్త సమయం పట్టినా మంచి సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ యువకుడు అంటున్నాడు. టీవీ చానెల్స్‌లో రకరకాల షోలు నిర్వహించిన ఈ 27 ఏళ్ల యువకుడు హీరో చాన్స్ కోసం నాలుగేళ్లు నిరీక్షించాడు. ‘ఎంటీవీ రోడీస్‌లో విజయం సాధించిన తరువాత చాలా సినిమాల్లో హీరోగానూ, రెండో హీరోగానూ అవకాశాలు వచ్చాయి. ఆ స్క్రిప్టులేవీ నాకు నచ్చలేదు. అందుకే నాలుగేళ్లు....

ఇక సినిమాలకు దూరంగా ఐశ్వర్య?

బాలీవుడ్‌ అందాల సుందరి ఐశ్వర్యరాయ్, ఇకపై కెమరా ముందుకు వచ్చే కన్పించడం లేదు. సినిమాలపై తనకు ఆసక్తి తగ్గినమాట వాస్తవమేనని, మళ్లీ సినిమాల్లో కన్పించే అవకాశాలు చాలా తక్కువేనని ఐశ్వర్యరారు తేల్చేసింది.ఐష్‌ తాజా ప్రకటనతో ఒక్కసారిగా ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పెళ్లయ్యాక కూడా బాలీవుడ్‌ హీరోయిన్‌గా నెంబర్‌వన్‌ పొజిషన్‌ తనదేనన్పించకుంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఐష్‌, చాన్నాళ్లకు వెండితెరకు దూరంగా....

Saturday, April 7, 2012

                                                     'రచ్చ' చిత్ర సమీక్ష            2.5/5                              
          
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం ఫై సంపత్ నంది దర్శకత్వం లో యన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రతి దానికీ పందెం కాసే బస్తీ వాసి బెట్టింగ్ 'రాజ్' ఒక సారి తన తండ్రి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమై తన ప్రత్యర్ధి జేమ్స్ తో ఓ పందెం కడతాడు. దాని ప్రకారం, ఫ్యాక్షనిస్ట్ బళ్ళారి కూతురు చైత్రను రాజ్ ప్రేమలోకి దించాలి. అవసరార్ధం దీనికి వప్పుకున్న రాజ్- చైత్ర తన ప్రేమకు పెట్టిన మూడు పరీక్షల్లో నెగ్గు తాడు. రాజ్ తో చైత్ర  'ఐ లవ్ యూ' చెప్పే   సమయానికి వారి ఫై దాడి చేసిన బళ్ళారి గ్యాంగ్  నుండి చైత్రను కాపాడేందుకు ఆమెను తీసుకుని శ్రీశైలం అడవుల్లోకి వెళ్తాడు.అక్కడ తెలుస్తుంది చైత్ర బళ్ళారి కూతురు కాదని ...ఆస్తి కోసం ఆమెను బళ్ళారి చంపాలను కుంటున్నాడని. దానితో పాటు రాజ్ తండ్రికి...వారి వూరికి బళ్ళారి చేసిన ద్రోహం కూడా తెలుసుకున్న రాజ్ ఏమి చేసాడనేదే ఈ చిత్ర కధాంశం .

యువ నటులతో యూత్ సినిమా చేసి విజయవంతం అయిన సంపత్ నంది రాంచరణ్ తో ఈ భారీ చిత్రం చేసి అంతగా సఫలం కాలేదు  .సక్సెస్ సాధించిన సినిమాల ఫార్ములాను ఎంచుకోవడం తప్ప, ప్రధానమైన కధ విషయం లోనే తప్పు చేసిన దర్శకుడు ...కధనం విషయం లో మరింత గందర గోళానికి లోనయ్యాడు. ఫ్యాక్షనిస్ట్ నేపధ్యం లో తెలుగులో వచ్చిన చాలా సినిమాల సన్నివేశాలే  ఈ చిత్రం లో కనిపిస్తాయి. 'బన్నీ' వంటి సినిమాలు గుర్తొస్తాయి. సినిమా అంతా సూపర్ స్పీడ్ లో నడిపించాలనే దర్శకుడు ...  ఏ సన్నివేశం  ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చెయ్యలేక పోయాడు. కొత్తగా వుంటే పర్వాలేదు ...రొటీన్ సన్నివేశాలని ఎంత వేగంగా చూపినా లాభం  లేదు. చివరికి,  సినిమాలో ప్రధానమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కూడా విఫల మయ్యాడు . సినిమా ప్రారంభంలో ట్రైన్ కి ఎదురెళ్ళే సన్నివేశం తో సహా ఫైట్స్ లో గ్రాఫిక్స్ ప్రభావం ఎక్కువైపోయి సహజత్వానికి దూరమైపోయాయి.  శ్రీశైలం అడవులని చెప్పి...వెదురు తోటల్లో విదేశీయులతో ఫైట్  పెట్టారు. క్లైమాక్స్ లో రొటీన్ నరుకుడు ఫైట్  సుదీర్ఘంగా ప్రేక్షకులను బాధించింది. సినిమాలో ప్రతి చిన్న పాత్రకీ పాపులర్ నటీనటులను పెట్టుకున్నారు.కానీ ఎవరినీ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

'బెట్టింగ్ రాజ్' గా పూర్తి మాస్ పాత్రలో  రాణించడానికి రాం చరణ్  బాగా కష్ట పడ్డాడు. అయితే చిరంజీవి లాకనిపించా లనే అతని ప్రయత్నం, అతని క్యారెక్టరైజేషన్ ...సినిమాటిక్ గానే వున్నాయి తప్ప , ప్రేక్షకులు హర్షించేలా లేవు. త్వరలో హిందీ సినిమా చేస్తున్నందుకు కాబోలు ...ఇందులో హిందీ  డైలాగులు ఎక్కువ పెట్టారు. పనిలో పనిగా ...నందమూరి వంశం  ఫైన  కూడా కొన్ని సెటైర్లు కొట్టారు.  చైత్ర గా తమన్నా తెలతెల్లగా అందంగానే వున్నా, ఆకర్షణీయంగా ఆనిపించలేదు. 'వానా వానా ' పాటలో మాత్రం సెక్సీ గా వుంది. రంగీలా గా బ్రహ్మానందం, లవ్ గురు పాపారావు గా అలీ కొంత నవ్వించారు. ఇతర పాత్రల్లో కోట, పార్తీపన్, దేవ్ గిల్, అజ్మల్, ముకేష్ రుషి,జయప్రకాష్ రెడ్డి,పరుచూరి వేంకటేశ్వర్ రావు, నాజర్, యల్.బి.శ్రీరాం,రవి బాబు తదితరులు నటించారు.పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అక్కడక్కడా పర్వాలేదు. హీరో విషయం లో చెప్పించిన డైలాగులు మాత్రం-' పిట్ట కొంచం ...పొగడ్త ఘనం'అన్నట్లున్నాయి. మణిశర్మ పాటల్లో టైటిల్ సాంగ్,'వాన వానా' తప్ప ఏ పాటా వినసొంపుగా లేదు. సమీర్ రెడ్డి  ఫోటోగ్రఫి బాగుంది.                                                                                                        -రాజేష్
                                                                                                                                                                                                                                              
                                                                                                                                                                                                                                                

Wednesday, April 4, 2012

ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

                                            ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

ప్రముఖ  చిత్ర నిర్మాణ సంస్థ  జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు  వి.బి.రాజేంద్ర ప్రసాద్  80 ఏళ్ళ పండగ (అశీతి మహోత్సవం) ఏప్రిల్  3  న రవీంద్రభారతి లో 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు  ఆధ్వర్యం లో  వైభవం గా జరిగింది.  ఇదే వేదిక ఫై జగపతి సంస్థ నిర్మించిన 'ఆరాధన' చిత్రం  50 ఏళ్ళ వేడుక కూడా నిర్వహించారు. సారిపల్లి కొండల రావు అధ్యక్షత వహించిన ఈ సభలో- డా"సి. నారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాసు కృష్ణా రెడ్డి , అక్కినేని నాగేశ్వర్ రావు, డి.రామా నాయుడు, టి.సుబ్బరామి రెడ్డి, జమున ,వాణిశ్రీ,  ఏడిద నాగేశ్వర్ రావు, అక్కినేని రమేష్ ప్రసాద్, మురళీ మోహన్, పీ . చంద్ర శేఖర రెడ్డి , జగపతి బాబులు పాల్గొని జగపతి రాజేంద్ర ప్రసాద్ ను ఘనం గా సత్కరించారు. "రాజేంద్రప్రసాద్ మనసున్న  మనిషి .జగపతి పతాకం ఫై సకుటుంబంగా చూడదగ్గ చిత్రాలు ఎన్నో అందించారు. వారు నిర్మించిన చిత్రాలన్నీ కధ....సంగీత పరంగా మంచి  స్థాయి కలిగినవి . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డ్ ఇచ్చి సత్కరించడం ఎంతైనా అభినందనీయం" -అంటూ ఈ సందర్భంగా హాజరైన  ప్రముఖులు ప్రశంసించారు .ఈ సందర్భం గా- 'ఆరాధన' చిత్ర కధా నాయకుడు అక్కినేనిని,'అన్నపూర్ణ' చిత్ర  నాయిక జమునని,' దసరాబుల్లోడు' చిత్ర నాయిక వాణిశ్రీ ని సత్కరించారు. ఈ సభలో-యస్.వి .రామారావు వ్యాఖ్యానం తో  చంద్ర తేజ, విజయ లక్ష్మి, వినోద్ బాబు లు అందించిన 'జగపతి చిత్ర గీతమాలిక' ప్రేక్షకులను విశేషంగా అలరించింది.