RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, November 16, 2012

టీవీ నంది 2011 అవార్డుల ప్రకటన

2011 సంవత్సరానికి టీవీ నంది అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల విజేతల వివరాలను సమాచార శాఖ మంత్రి డీకే అరుణ సోమవారమిక్కడ సచివాలయంలో వెల్లడించారు. ఈ అవార్డుల ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. వారు విజేతల వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అవార్డులు పొందిన టీవీ సీరియళ్లు ఇవే..
ఉత్తమ టెలి చిత్రం: నాభూమి(దూరదర్శన్), ద్వితీయ ఉత్తమ టెలి చిత్రం: జోగిని(దూరదర్శన్); ఉత్తమ టీవీ ఫీచర్: అదుర్స్(ఈటీవీ), ద్వితీయ ఉత్తమ టెలి ఫీచర్: బ్రహ్మమొక్కటే(ఎస్వీబీసీ); ఉత్తమ మెగా సీరియల్: నయన(ఎస్వీబీసీ), ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్: పంచతంత్రం(ఈటీవీ); ఉత్తమ టీవీ డెయిలీ సీరియల్: పసుపు కుంకుమ(జీ టీవీ), ద్వితీయ ఉత్తమ డెయిలీ సీరియల్: మమతల కోవెల(జెమినీ టీవీ); ఉత్తమ దర్శకుడు: జి.అనిల్ కుమార్(మనసు మమత); ఉత్తమ నటుడు(అచ్యుత్ అవార్డు): శుభలేఖ సుధాకర్, ఉత్తమ నటి: ఆర్.పల్లవి(భార్యామణి); ఉత్తమ సహాయ నటుడు: కె.జయరాం(ఆడదే ఆధారం), ఉత్తమ సహాయ నటి: మధుమణి(జోగిని); ఉత్తమ హాస్య నటుడు: రామ్‌జగన్(చూడు చూడు తమాషా), ఉత్తమ హాస్యనటి: శ్రీలక్ష్మి(నేనే మీ అల్లుడు); ఉత్తమ విలన్: లావణ్య లహరి(అంతఃపురం); ఉత్తమ బాల నటుడు: మాస్టర్ నరేష్ చంద్ర(పసుపు కుంకుమ), ఉత్తమ బాల నటి: బేబీ అనూష, బేబీ దివిజ(అన్నా చెల్లెలు); ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: పి.భవాని ప్రసాద్(ధరణి), ఉత్తమ కథా రచయిత: దివంగత సీహెచ్ సుమన్. వీటితోపాటు ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణల రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు తదితర అవార్డులు ప్రకటించారు.
స్పెషల్ జ్యూరీ అవార్డులు
శ్రీ జమ, జయవాణి(జ్ఞాపకాలు), జి.ఉమా మహేశ్వరరావు(ఓం నమః), కె.వి.రెడ్డి(కుంకుమ రేఖ), జక్కల వెంకన్న(నాలో నేను), కర్రి బాలాజీ (బంద్). ఉత్తమ న్యూస్‌రీడర్‌లుగా కె.వినోద్ కుమార్(హెచ్‌ఎం టీవీ), ఎస్.లక్ష్మీ కళ్యాణి(టీవీ5)లకు జ్యూరీ అవార్డులు దక్కాయి.

0 comments:

Post a Comment