RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 20, 2013

'బిరియాని' చిత్ర సమీక్ష

                                  'బిరియాని'  చిత్ర సమీక్ష  3/5

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా  వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు . 

సుదీర్  అమ్మాయిలను అమితంగా ఆకట్టుకునే  టాలెంట్ తో   ప్లే బాయ్ లా, చిన్న నాటి మిత్రుడు పరశు రామ్ తో
కలిసి  తిరుగుతుంటాడు  .ఇండస్ట్రియలిస్ట్ అయిన వరదరాజన్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు . ఒక రోజు వరదరాజన్ ఇచ్చిన ఓ పార్టీకి వచ్చి,వెళ్తూ -బిర్యానీ కోసం వెదుకుతున్న  సుదీర్ -పరశు లకు  హాట్ బ్యూటీ మాయ తగులు తుంది. ఆమె మాయకి పడిపోయి మాయతో కలిసి ఆమె హోటల్ కి వెళతారు . ఆ రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేసిన వారికి , ఉదయం లేచి చూస్తే మాయ కనిపించదు. సుదీర్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు.  ఆ మర్డర్ కేసు నుండి తనని రక్షించు కోవడానికి ప్రేమికురాలు ప్రియాంక తో పాటు , స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఆ మర్డర్ మిస్టరీని  సుదీర్ ఎలా చేదించాడు?అనేదే మిగిలిన కథాంశం..

ఇటీవల కొన్నిచిత్రాల  చేదు అనుభవం అందుకున్న  కార్తీ హిట్ కొట్టక తప్పని చిత్రం ఇది . ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం కార్తీని , ప్రేక్షకులను నిరాశ  పరచలేదు . హీరో ను ను ప్లే బాయ్ గా చూపుతూ, మంచి మసాలా బ్యాక్ గ్రౌండ్ లో వెంకట్ ప్రభు  తరహా స్క్రీన్ ప్లే ... సస్పెన్స్ తో ఈ చిత్రం నడుస్తుంది . మొదటి భాగం అంతా సరదా సన్నివేశాలతో , కాస్త చిరాకు తెప్పించినా -ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకి ఊపు నిచ్చాయి . రెండవ భాగం ఆసక్తికరం గా, వేగం గా సాగుతుంది .అందువల్ల చాలా లాజిక్స్ మిస్ అయినా ప్రేక్షకుడు గుర్తించడు  . హోటల్ లో వరద రాజన్ హత్య  జరిగినప్పుడు సి. సి. కెమెరాతో పాటు, చాలా మంది దాన్ని గమనించడానికున్న అవకాశాన్నీ  దర్శకుడు దాటవేశాడు .అలాగే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు , సస్పెన్స్ రివీల్  చేసేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతాము . ఎంత జాగ్రత్తగా చేసినా, డబ్బింగ్ సినిమా వాసనలు పోలేదు  .  అయితే హీరో ను పోలీసులు చేజ్ చేస్తుంటే -దానికి పాటను జత చెయ్యడం , రైల్వే స్టేషన్ లో ఉత్కంట కలిగించే  సన్నివేశం లో -'ఫ్లాష్ మాబ్ డాన్స్' పెట్టడం కొత్తగా అనిపిస్తాయి .  క్లైమాక్స్  ఈ చిత్రానికి హై లైట్ .సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ జొప్పించడం ఈ దర్శకుడి ప్రత్యేకత .  

సుదీర్ గా ప్లే బాయ్ తరహా పాత్రలో కార్తీ మొదటి భాగం లో మంచి వినోదాన్ని అందిస్తూ , రెండవ భాగం లో హీరోయిజాన్ని చక్కగా  పండించాడు  .ఒక పాటలో స్వంత గొంతు కలిపాడు . హన్సిక అందం గా , పాత్రోచితం గా చేసింది .  సుదీర్ మిత్రుడు పరశురామ్ గా ప్రేమ జీ   హీరో కు మంచి సపోర్ట్  అందించాడు .మాయ గా మాండీ  వేడి వేడిగా కనిపించింది  , వరదరాజన్ గా నాజర్ , హీరో అక్క గా మధుమిత , సి .బి .ఐ అధికారి రియాజ్ గా సంపత్ , కాంట్రాక్ట్ కిల్లర్ - హిట్ వుమన్ గా ఉమా ,  పరశురామ్ అల్లుడు విజయ కృష్ణ గా రాంకీ తమ తమ పాత్రలను బాగా పోషించారు . యువ హీరో జై కూడా ఒకసారి కనిపించాడు  . 

వందవ చిత్రం అయినప్పటికీ  యువన్ శంకర్ రాజా ఈ చిత్రం లో ఒక్క పాటా బాగుందనిపించలేదు . రీ రికార్డింగ్ మాత్రం కొత్తగా , బ్రహ్మాండం గా చేసాడు .శశాంక్ వెన్నెలకంటి మాటలు  ప్రత్యేకం గా చెప్పు కోవాల్సినంత బాగున్నాయి . శక్తి శరవణన్ ఫోటోగ్రఫీ , ప్రవీణ్ - ప్రశాంత్ ల ఎడిటింగ్ , శెల్వ స్టంట్స్ బాగున్నాయి                                             -రాజేష్

Thursday, December 19, 2013

ఈ ఏడాది నిర్మాతలకు నష్టాలు ...కష్టాలే !


170 రిలీజ్‌లు... 140 అట్టర్‌ప్లాప్‌లు..14 విజయాలు.. 70-80మంది కొత్త నిర్మాతల ఘోర వైఫల్యం . ఇదీ ఈ ఏడాది తెలుగు సినిమా సాధించిన ఘనత. సక్సెస్‌ శాతం 10 కూడా లేదు. బడా సినిమాలు విజయాలు సాధించినా వాటిలో లాభాలొచ్చింది తక్కువే. పరిమిత బడ్జెట్‌ సినిమాలు ఓ మోస్తరు విజయం సాధించినా నిర్మాతలకు లాభాల్ని తెచ్చాయి. రూ.40కోట్ల ఖర్చుతో తెరకెక్కిన సినిమా రూ.50కోట్లు తెస్తే ప్రయోజనమేంటి? రూ.10కోట్లతో తెరకెక్కి 20కోట్లు వసూలు చేస్తేనే గొప్ప.... 

ప్రేమ..పెళ్లి..విడాకులు - అదే ఆనవాయితీ


భార్య వెళ్లిపోయినా.. నన్ను వదిలి నీవు పోలేవులే అంటూ బాలీవుడ్ 'క్రిష్'హృతిక్‌ రోషన్ విరహగీతం పాడుతున్నాడు. 'ఎప్పటికీ తన హృదయంలో నిదురించే చెలి సుసానే'- అంటూ ఫేస్‌బుక్‌లో ప్రేమ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తాను లేకపోతేనే సుఖమనుకుంటే ఆ దుఃఖాన్ని భరిస్తానంటున్నాడు. సుసానే కోసం తన మనసు తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని 'ఓపెన్‌ హార్ట్' తో చెబుతున్నాడు. సుసానే దూరమవటాన్ని తట్టుకోలేని హృతిక్‌.. హృతిక్‌ రోషన్‌. బాలీవుడ్‌లో ఎగసిపడ్డ యువకెరటం. మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన హీరో. హాలీవుడ్‌ ఫాంటసీ హీరోలకు ధీటుగా 'క్రిష్‌'గా బాలీవుడ్‌లో ఎదిగిన కథానాయకుడు. 'అగ్నిపథ్‌' సినిమాతో తనలోని ఎమోషన్‌ని బయటకు తీసిన నటుడు. సూపర్‌ సినిమాలున్నా....

విజయం పట్ల పూర్తి నమ్మకం తో ...కార్తీ


విభిన్న కథాంశాలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ విలక్షణ హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ ‘ఆవారా’ ‘నా పేరు శివ’లాంటి విజయవంతమై చిత్రాలతో ఆయన తెలుగుప్రేక్షకులకు చేరువయ్యారు. కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బిరియాని’. వెంకట్‌ప్రభు దర్శకుడు. స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. హన్సిక కథానాయిక. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కార్తీ చెప్పిన విశేషాలివి....

Thursday, December 12, 2013

జెన్నిఫర్‌ లోపెజ్‌ అందాల రహస్యం

వెండితెరపైనా వెలగాలని .... యామీ గౌతమ్



అందమైన ముఖం, ఆకట్టుకునే నవ్వు, చూడగానే 'వావ్' అనిపించే శరీర సౌష్టవం ఇవ్వన్నీ కలబోసిన బొమ్మలా ఉంటుంది యామీ గౌతమ్ . ఎప్పటికైనా ఐఎఎస్‌ అవ్వాలన్నది తన జీవిత ధ్యేయం. కానీ అనుకోకుండా మోడల్‌గా అవకాశాలు వచ్చిపడడం....మిత్రుల ప్రోత్సాహంతో నటన వైపు మళ్లింది. మోడల్‌గా నిరూపించుకుని వెండితెరపై అడుగుపెట్టింది. అయితే మోడల్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న యామీ వెండితెరపై అంతగా సక్సెస్‌ కాలేకపోతోంది. నితిన్‌తో తీసే'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' చిత్రమైనా....

వినూత్న ప్రయోగాలు నటులకు చాలా ముఖ్యం!

అతన్ని ప్రేమించి పెద్ద తప్పు చేసా! -హన్సిక



శింబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమలోని పలువురు హెచ్చరించినా పట్టించుకోకుండా ప్రేమించానని, ఇప్పుడాయన నిజ స్వరూపం తెలిందని నటి హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. శింబు, హన్సిక ప్రేమించుకుంటున్నారని వెల్లడించగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నటి కుష్బూ, సిమ్రాన్ వంటి సీనియర్ తారామణులు శింబు ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త అంటూ హన్సికను హెచ్చరించారు. అయినా తాము ప్రేమలో పడ్డామని....

అసిన్ పెళ్లి చేసుకుందా ?



నటి అసిన్ పెళ్లి చేసుకుందా ? ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతున్న వేడివేడి చర్చ ఇదే. కేరళ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ అసిన్. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక రౌండ్ కొట్టి 'గజని' చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా కొంత కాలం హవా కొనసాగించింది. ప్రస్తుతం అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో అసిన్ పెళ్లి చేసుకుని ....

Thursday, November 14, 2013

'మసాలా' చిత్ర సమీక్ష

                             'మసాలా' చిత్ర సమీక్ష            2.5/5


'సురేష్ ప్రొడక్షన్', 'స్రవంతి బ్యానర్ ' సంయుక్తంగా కె . విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాయి   


భీమరాజపురం అనే ఊళ్ళో బలరాం(వెంకటేష్) అనే జమీందారుంటాడు. అతనికి బ్రిటిష్ వాళ్ళని మించిపోయే ఇంగ్లీషు మాట్లాడాలని కోరిక .. అబద్ధమంటే కోపం. బలరాం చెల్లెలు(షాజన్ పదమ్సీ ). బలరాం విరోధి  బామ్మర్ది   (పోసాని).  మేనేజర్ నారాయణ(ఎమ్మెఎస్ నారాయణ) . ఇతని స్నేహితుడి కొడుకు రెహమాన్(రామ్).అతనికో అక్క(అంజలి).   ఇబ్బందుల్లో వున్నరెహమాన్ ను నారాయణ జమీందార్ వద్ద పని ఇప్పిస్తానని  భీమరాజపురానికి తీసుకొస్తాడు  . అక్కడ రామ్ గా తన పేరు అబద్దం చెప్పి రెహమాన్ బలరాం దగ్గర  కోటలో ఉద్యోగం సంపాయిస్తాడు . రెహమాన్ తన పేరులో ఆడిన ఆబద్ధం కోసం మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది .ఒకసారి నమాజ్ చేస్తుండగా దొరికిపోయిన రామ్- 'తనకు రెహమాన్ అనే తమ్ముడున్నాడని, అతను నమాజ్ చేస్తుండగానే మీరు  చూసారంటూ' మాయ చేస్తాడు . ఇక ఓ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న బలరాం చెల్లెలు  ఇంటికి వస్తుంది. ఆమెతో రామ్ లవ్ లో పడతాడు. ఆ విషయం  బలరాంకు తెలుస్తుంది. ఆతర్వాత రామ్ చెప్పిన అబద్ధాలుకూడా  బలరాంకు తెలుస్తాయి .ఆ తర్వాత ఏం జరిగిందనేది తెర ఫై చూడాలి .... 
    
ఈ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలకు మొగ్గు చూపిన వెంకటేష్ , యువ హీరో రామ్ లు కలిసి స్వంత సంస్థల ఫై రూపొందించిన  ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి . ఇది హిందీ హిట్ 'బోల్ బచ్చన్' కి రీమేక్ .  ఆ చిత్రానికి కాపీ ఫేస్ట్ గానే ఈ చిత్రం  కనిపిస్తుంది.  ఏదైనా.. సినిమాను రీమేక్ చేసే  ముందు  మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటారు .  కానీ అవేమీ లేకుండా మక్కికి మక్కి దించేశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఈ 'మసాలా' చిత్రంలో ప్రధానంగా అదే లోపంగా కనిపిస్తుంది. కథకు, పాత్రలకు, మాట్లాడే బాషకు సంబంధం ఉండదు. ఒక అబద్ధం అనేక అబద్ధాలు ....వాటికోసం  అనేక పాత్రలు ....ఇలాంటి కామెడీ తెలుగు ప్రేక్షకులు రోటీన్ గా చూస్తున్నదే. లాజిక్ మచ్చుకైనా లేని ఈ చిత్రం లో కనీసం ప్రేక్షకులను అక్కట్టుకునే మ్యాజిక్ అయినా లేదు .   దర్శకుడు అన్నివిధాలా విఫలమయ్యాడు. పాత్రల, సన్నివేశాల లక్ష్యం ఏమిటో  క్లారిటీ లేదు. -వెంకటేష్ - షాజన్ మధ్య అన్నచెల్లెలి అనుబంధాలు ఎక్కడా కనిపించవు.అలాగే అంజలి తో అతని ప్రేమ కూడా ఆర్టిఫిషియల్ గా వుంది . జమీందార్  'మసాలా డ్రామా కంపెనీ' చుట్టూ తిరగడం ఆయన పాత్ర హుందాతనానికి తగినట్లు  లేదు. కామెడీ విలన్ (పోసాని)వల్ల   సినిమా లో గ్రిప్ పోయింది.కేవలం- 'జమీందార్ కు  అబద్ధమంటే పడదు...హీరో అతనికి అబద్ధం చెప్పాడు' అనే అంశం  ఫైనే సినిమా నడుస్తుంది . క్లైమాక్స్ లో 'ఎంత మోసం' అంటూ పెట్టిన డ్రామా   బలహీనంగా  చిత్రీకరించడం తో సిన్మాకు మైనస్ అయ్యింది . 
 
జమీందార్ బలరాం గా వెంకటేష్  మొదటి సారి  డిఫరెంట్ పాత్ర లో  నటించాడు.  
 'క్యాట్ అండర్ ది హ్యాండ్ సెర్చింగ్ మదర్ ల్యాండ్'. 'ఐ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్'. 'నా లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా మథర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్'. అంటూ వెంకటేష్ చేసిన బట్లర్ ఇంగ్లీష్ కామెడీ ప్రేక్షకులను నవ్వించింది .అయితే ఈ బట్లర్ ఇంగ్లీష్ ప్రయోగం ప్రేక్షకుల్లో ఎంతమందికి అర్ధమవుతుందో ఏమో ?  'రామ్', 'రెహమాన్' పాత్రల్లో రామ్ బాగా నటించాడు. రెహమాన్ గా కష్ట పడ్డాడు . రెండు పాటల్లో బాగా డాన్స్ చేసాడు . షాజన్  అందంలో గానీ..నటనలోగానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆమెది రాంగ్ సెలక్షన్ -అనే చెప్పాలి .  రామ్ కి అక్కగా, వెంకటేష్ కి ప్రియురాలిగా చేసిన అంజలి, అక్కగానే బాగుందనిపించింది. ఇక వయసు మీరిన  కొవై సరళ  చేసిన  డ్యాన్స్ లు  కొద్దిగా  నవ్వించినా.. ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది .ఎద్దు గా  జయప్రకాష్ రెడ్డి , అలీ, ఎమ్మెస్ నారాయణ బాగానే చేసారు .  తమన్ పాటల్లో 'నిను చూడని' ,'దుమ్ములే' ,'మీనాక్షి'...ఓకే .  మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించారు . అండ్రూ  ఫోటోగ్రఫీ ,వర్మ ఎడిటింగ్ బాగుంది. అనిల్ రావిపూడి సంభాషణలు బాగా రాసాడు               -రాజేష్  

Wednesday, November 13, 2013

పిల్లల్ని కనడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను -కరీనా


కొన్ని సంవత్సరాల పాటు అతడితో కలిసి జీవించాను. పెళ్లి అనేది సమాజానికి అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కానీ నా వరకూ నేను ఏ రోజైతే అతడికి నా మనసులో స్థానం ఇచ్చానో, అప్పుడే తనకి భార్యనైపోయానని అనుకున్నాను. కలిసివున్న అన్నేళ్లలో మా బంధం బలంగా లేదని అనిపించివుంటే అసలు మేం పెళ్లి వరకూ వెళ్లేవాళ్లమే కాదు. కాబట్టి... ఆల్రెడీ రిలేషన్ దృఢంగా ఉన్నప్పుడు ఇక చేయడానికేముంటుంది!... 

రజనీ స్టైల్ యానిమేటెడ్ బొమ్మలో చూడలేరా?


ఇటీవలే‘కొచ్చాడ యాన్‌’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజైనప్పుడు జనాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి . రజనీ స్టైల్ కేవలం యానిమేటెడ్ బొమ్మలో చూడడం కష్టం. ఒరిజినాలిటీ లేదు.. అని విమర్శలొచ్చాయి . సూపర్‌స్టార్‌ని ఓ 3డి బొమ్మగా చూడలేమని వ్యాఖ్యానించారు కొందరు. అయితే , ఈ సినిమా థియేటర్స్ లోకి రిలీజై విమర్శల్ని తిప్పి కొడుతుందేమో వేచి చూడాలి....

'క్రిష్‌' హృతిక్‌ చెప్పిన 'టింకిల్'...


బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌కు ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. నటుడిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో, ఫలితం మాత్రం ఆయన్ని ఉత్సాహపరచలేదు. కానీ కేవలం వాణిజ్య విలువలతో తెరకెక్కించిన 'క్రిష్‌-3' ఊహించని విజయానందాన్ని అందించింది. ఇండిస్టీ తనను పెద్ద స్టార్‌గా గుర్తించే అవకాశాన్ని 'క్రిష్‌-3' చిత్రం హృతిక్‌ రోషన్‌కు కల్పించింది. ఈ సక్సెస్‌ను ఆయన పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. ...

అందంతో పాటు సేవా గుణం! -సుస్మిత



అందం అంటే రూపం ఒక్కటే కాదు . విశ్వ సుందరి కిరీటాన్ని గెలిచి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా సుస్మితాసేన్‌ 'నేనున్నాను' అంటూ ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లి కాకపోయినా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇది హర్షించదగిన విషయం. ఆడపిల్లలు అంటేనే బయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న నేటి కాలంలో ఈమె దత్తత తీసుకున్నది ఇద్దరూ ఆడపిల్లలే కావడం గమనార్హం. అందులో ఒకరి కోసం న్యాయపోరాటం కూడా చేసింది. పిల్లల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆమె మాటలు....

షారుఖ్‌... 'అన్‌ఫెయిర్' ప్రకటనలొద్దు!


సినిమా హీరోలు, హీరోయిన్లు, క్రికెట్ క్రీడాకారులు - ఇటువంటి సెలబ్రిటీలు చెప్పే మాటలు ప్రజల మీద బలంగా ముద్ర వేస్తాయి. అందుకే ప్రకటనల్లో సెలబ్రిటీలని వాడి తమ ఉత్పత్తులని మార్కెట్ చేసుకుంటుంటాయి కంపెనీలు. ఇలాంటప్పుడే సెలబ్రిటీలు జాగరూకతతో ఉండాలి. తాము ప్రచారకర్తగా ఉన్న ఉత్పత్తులు ఎంతవరకు సరైనవో ఆలోచించాలి. అంతేకాని వాస్తవదూరంగా వ్యవహరిస్తే షారుక్ ఖాన్‌కి ఎదురైన పరిస్థితే మిగతా సెలబ్రిటీలకు వస్తుంది....

Thursday, November 7, 2013

ప్రజా నాయకులు కాదు, ప్రజాప్రతినిధులు మాత్రమే!

వందకోట్ల మైలు రాయి దాటిన చిత్రాలు

బాలీవుడ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తీగా మారిపోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు ఎన్ని రోజులు అడిందని చూడటంలేదు. వందరోజులు, సిల్వర్ జూబ్లీ, సూపర్ హిట్, బంపర్ హిట్లు ఇప్పుడు లెక్కలేదు. ఎన్ని కో్ట్ల రూపాయలు వసూలు చేసిందనేదే ముఖ్యం. తక్కువ రోజులు ఆడినా కలెక్షన్లు రాబడితేనే హిట్గా భావిస్తారు. వంద కోట్లు దాటితేనే బంపర్ హిట్ కింద లెక్క. వంద కోట్లు, అంతకు మించి వసూలు చేస్తే గొప్ప. ఇప్పటి వరకూ బాలీవుడ్, కోలీవుడ్ కలుపుకొని 25 చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాయి. సినిమా నిర్మాణం కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న లక్ష్యంతో జరుగుతోంది. పెద్ద హీరోల లక్ష్యం వంద కోట్లు....

Saturday, November 2, 2013

మల్లిక బుల్లితెర స్వయంవరం

'మర్డర్‌' సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్‌. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్‌ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ భాగానే సాగుతోంది. మర్డర్‌ చిత్రం ద్వారా శృంగార తారగా ముద్ర వేసుకున్నారు. యువత గుండెలను కొల్లగొట్టారు. హాట్‌ హాట్‌గా కనిపించి కుర్రకారు మతిపోయేలా చేశారు మల్లిక... హర్యాన రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో పుట్టింది మల్లిక. రీమా లంబ అని పేరును మల్లికగా సినిమాల్లోకి వచ్చే ముందు మార్చుకుంది.... 

'3 డీ' తేలిపోయింది !

ఈతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. నేటి ప్రేక్షకుడు కూడా ఓ డైరెక్టర్‌లా ఆలోచిస్తున్నాడు. పోస్టర్‌ను చూసి సినిమా కథేంటో చెప్పేస్తున్నాడు. ఈ తరుణంలో సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలని దర్శకనిర్మాతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారికి లభించిన ఆయుధం 3డీ. ఈ టెక్నాలజీతో తెలుగు సినిమాకు సరికొత్త ఆకర్షణ తేవాలని దర్శకనిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో 3డీ ఫార్మాట్‌లో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు .....

మళ్ళీ త్రిష- రానా మధ్య ప్రేమాయణం మొదలు


త్రిషకు పెళ్లికళ వచ్చేసిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అందుకే ఆమె కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ చెన్నై సుందరి 2002లో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పట్లో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్లు నేడు పెళ్లిళ్లు చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో త్రిషకూ పెళ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయించినట్లు సమాచారం. ఇంకేం వరుడిని వెతికే పనిలో పడ్డారట. అదే విధంగా త్రిషకు తెలుగు యువ నటుడు రానా మధ్య ప్రేమాయణం సాగుతోందనే....

హాలీవుడ్లో నిర్మాతగా విజయవంతమై..అశోక్ అమృతరాజ్

సన్నగా, నల్లగా ఉన్న తమిళ కుర్రాడు టెన్నీస్ బాగా ఆడేవాడు. అతనే కాదు. అతని సోదరులు కూడా ఛాంపియన్లే. వారు నెమ్మదిగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెన్నీస్ క్రీడాకారుల్లో ఒకరిగా ఎదిగారు. ఆ సమయంలో ఈ కుర్రాడికి హాలీవుడ్ మీద కన్నుపడింది. టెన్నీస్‌ను వదిలి హాలీవుడ్‌కు జంప్ చేశాడు. ప్రపంచంలోనే విజయవంతమైన హాలీవుడ్ నిర్మాతల్లో ఒకరిగా ఎదిగాడు. ఘోస్ట్ రైడర్, స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్, బ్రింగింగ్ డౌన్ ది హౌస్, ప్రిమానిషన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. ఇప్పటి దాకా అతను తీసిన సినిమాలకు 6000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చింది. ఒకప్పుడు చెన్నైలో సైకిళ్ల మీద తిరిగిన ఈ కుర్రాడికి ఇప్పుడు సొంత విమానం కూడా ఉంది. ఆ కుర్రాడి పేరు అశోక్ అమృతరాజ్. ఆయన తాజాగా రాసిన ఆత్మకథే అడ్వాంటేజ్ హాలీవుడ్. దానిలో నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.....

Friday, October 25, 2013

' భాయ్' చిత్ర సమీక్ష

                                       ' భాయ్' చిత్ర సమీక్ష 2.25 /5




రిలయన్స్ సమర్పణ లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం ఫై వీరభద్రం దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు . 

             పలుదేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించిన హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ తన కొడుకులు టోనీ , జేమ్స్ కన్నా భాయ్ నే ఎక్కువగా నమ్ముతాడు . హైదరాబాద్ లో ఒక గుర్తు తెలియని పోలీస్ అధికారి తన ముఖ్య అనుచరులను చంపేస్తున్నాడని తెలిసి -భాయ్ ని అక్కడికి పంపుతాడు . తమ వారిని చంపుతున్న పోలీస్ అధికారిని గుర్తించిన భాయ్ కి - అతన్ని చంపాలనుకున్న  సమయం లో తెలుస్తుంది ... 'అతను తన తమ్ముడు అర్జున్' అని  . అదేసమయం లో తన చెల్లెలు కూడా కలుస్తుంది.  ఆమెకు దగ్గరుండి పెళ్లిచేసేందుకు  వెడ్డింగ్ ప్లానర్ గా మారి, అడ్డంకులను తొలగించి  పెళ్లి జరిపిస్తాడు . అర్జున్ చేతిలో తన పెద్ద కొడుకు టోనీ చనిపోవడం తో, చిన్న కొడుకు జేమ్స్ తో  కలిసి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి డేవిడ్ హైదరాబాద్ వస్తాడు .వారి బారి  నుండి  భాయ్  తన  వారిని ఎలా కాపాడుకున్నాడు ? అసలు ఈ భాయ్ గతమేమిటి ?అనేది సినిమాలో చూడాలి ...

 .              రెండు హాస్యప్రధానమైన చిత్రాలతో విజయవంతమైన దర్శకుడు వీరభద్రం ఈ సారి యాక్షన్ ప్రధాన చిత్రం చెయ్యడం విశేషం . "ఈ కధను ఏడేళ్ళ క్రితమే నాగార్జున కోసం తయారు చేసా"నని ఓ ప్రెస్ మీట్ లో వీరభద్రం చెప్పారు . ఈ సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది .ఎప్పుడో తియ్యాల్సిన కధతో ఈ చిత్రం ఇప్పుడు తీసారనిపిస్తుంది  . ఇలాంటి కధతో ఈ మధ్య కాలం లో 'గబ్బర్ సింగ్' ,'షాడో' తో సహా ఎన్నో సినిమాలొచ్చాయి . సరే, పాత కధతోనే అయినా- ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారా? 'తీర్ధానికి తీర్ధం- ప్రసాదానికి ప్రసాదం' అన్నట్లు తలా తోకా లేని సన్నివేశాలను గుదిగుచ్చి సినిమాగా మార్చారు .కామెడీ స్పెషలిస్ట్ అయిన దర్శకుడు -ఈ చిత్రం లో బ్రహ్మానందం వంటి నటులున్నా  హాస్యాన్నిబాగా  పండించ లేకపోయాడు .  మంచి కమర్షియల్ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఈ చిత్రానికి వున్నాఅందువల్లనే ఉపయోగం లేకుండా పోయింది .ఈ చిత్రం లో రత్నబాబు -సందీప్ రాసిన డైలాగ్స్ హైలైట్ . చాలా సన్నివేశాల్లో  పేలాయి .అయితే- ఏదన్నా మోతాదుకు మించితే ఇబ్బందే .ఇందులో అసందర్భ సంభాషణలు కూడా వినిపించాయి  .హీరో  మౌత్ ఆర్గన్ వాయించగానే చెల్లి 'అన్నయ్యా' అంటూ పరుగెత్తుకు రావడం- వంటి సిల్లీ సంగతులు  ఇందులో బోలెడు.  బిల్డప్ ఎక్కువ ఇచ్చిన  - హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ ని , పవర్ ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ ని   సినిమా రెండవ భాగం లో డమ్మీలను చేసేసి సినిమాలో ఫోర్స్ ని చంపేశారు . 

             వయసు పెరుగుతున్నా నాగార్జున గ్లామర్ లో తరుగుదల లేదు . మూడు రకాల గెటప్స్ లో ఎంతో స్టైలిష్ గా, హుషారుగా చేసారు . తెలంగాణా  మాండలీకంలో మాట్లాడటం కూడా విశేషం . అయితే మాస్ యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం అతను గతం లో  చేసిన చిత్రాలు గుర్తుకొస్తాయి . హీరోయిన్ కావాలి కాబట్టి రిచా ను పెట్టారు .పాటల్లో ఆమె అందం గానే వుంది . కామ్న ఒక్క సీన్ లో  ఎందుకు వుందో అర్ధం కాదు . చెల్లిగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ జారా ఎంపిక కూడా కరెక్ట్ కాదు . ఆశిష్ విద్యార్ధి , సయ్యాజి షిండే, సోనూ సూద్ వంటి మంచి నటులను ఉపయోగించుకోలేక పోయారు . మందు మేన్షన్ రాజు గా ఎమ్మెస్ నారాయణ పాత్ర ...'రూలర్' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించడం బాగుంది . ఎన్నారై  విక్రం డోనర్ గా బ్రహ్మానందం పాత్ర  పర్వాలేదు.అతను అమీర్ పేట...అంబర్ పేటల మధ్య కన్ఫ్యూజ్  కావడం తమాషాగా వుంది . తమ్ముడు అర్జున్ గా స్నేహ భర్త ప్రసన్న ,ఇతర పాత్రల్లో నాగి నీడు , నర్సింగ్ యాదవ్, అజయ్ , పరుచూరి వెంకటేశ్వర రావు , జయప్రకాశ్ రెడ్డి ,రఘుబాబు , సత్యం రాజేష్ , వెన్నెల కిషోర్  తదితరులు నటించారు . కనువిందు కోసం ఒక పాటలో నటాలియా కౌర్ , మరో పాటలో హంసా  నందిని  కనిపించారు . దేవిశ్రీ ప్రసాద్ స్థాయి లో పాటలు లేవు కానీ, 'ఓకే' అనిపిస్తాయి . పాటల చిత్రీకరణ బాగుంది .రీ రికార్డింగ్ కూడా పర్వాలేదు .  సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది                        -రాజేష్ 

Monday, October 14, 2013

ఆస్కార్ రోడ్ లో 'ది గుడ్ రోడ్'

దర్శకుడు జ్ఞాన్‌ కొరీ తన తొలి చిత్రమైన గుజరాతీ సినిమా 'ది గుడ్‌ రోడ్‌' తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఆ చిత్రం విదేశీ భాషా చిత్ర విభాగంలో భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్ళింది. 'లంచ్‌ బాక్స్‌' కాకుండా ఈ చిత్రం ఎంట్రీగా వెళ్ళడం వివాదాస్పదమైంది. అదే సమయంలో తొలి సినిమాతోనే ఈ అరుదైన ఘనత సాధించిన జ్ఞాన్‌ను అభినందిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. 60వ జాతీయ అవార్డుల్లోని ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఈ ఏడాది ఉత్తమ గుజరాతీ చిత్రంగా ఎన్నికైన ఘనత కూడా....

ఎంతైనా శ్రీదేవి కూతురు కదా మరి!



'పదహారేళ్ల వయసు' చిత్రంలో శ్రీదేవి వయసెంతో గుర్తులేదు కానీ, పదహారేళ్లున్న ఆమె పెద్దకూతురు జాహ్నవి కపూర్ మాత్రం ఇదే వయసులో.. అరంగేట్రం కోసం ప్రయత్నిస్తోందట! నవరస నటనామృతాన్ని ప్రేక్షకులకు ధారపోసిన శ్రీదేవి జ్ఞాపకాలను.. ఇప్పుడు జాహ్నవిలో చూసుకుని మురిసిపోయేందుకు ఆరాటపడుతున్నారు అభిమానులు. వారి కల నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాహ్నవి. ఈమధ్యనే జరిగిన ఒక ఫ్యాషన్‌షోలో అందరి దృష్టిలో పడిందీ అమ్మడు. అందులోను తొలిసారిగా ప్రత్యేక ఫోటోషూట్‌కు ఫోజులు ఇవ్వడంతో- కెమెరాలన్నీ ఈ చిన్నారి చిలకమ్మ వైపు తిరిగాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఫోటోలు అప్‌లోడ్ చేసే అలవాటున్న జాహ్నవి.. ఇప్పటికే బోలెడంత మంది అభిమానుల మనసుదోచుకుంది. రోజూ జిమ్‌కు వెళ్లడం, డ్యాన్స్ చేయడమంటే తనకిష్టమట! కరణ్‌జోహార్ తీయబోయే సినిమాతో జాహ్నవి తెరమీద మెరిసే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. తెలుగులో కూడా అగ్రహీరోల సరసన నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలూ వచ్చాయి. ఏవి ఎంత నిజమో కొన్నాళ్లు ఆగితేకానీ తెలియదు. జాహ్నవి అందరికీ ఇంత హాట్ ఫేవరెట్ అయ్యిందంటే.. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా మరి!

స్వచ్ఛమైన ప్రేమకోసమే మల్లికా షెరావత్

ఎదగాలనే తపనతో ముందుకు ...శ్రద్ధాకపూర్‌

‘ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. ఫలానా పాత్రే కావాలని అనుకోవడం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవిధంగా నన్ను నేను మలుచుకుంటా. పరిశ్రమలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకుంటా’ శ్రద్ధాకపూర్‌ అని తెలిపింది. ఆషిఖి 2 సినిమా హిట్‌ కావడంతో బాలీవుడ్‌లో మంచి స్థానం దక్కినట్టు నటి శ్రద్ధాకపూర్‌ భావిస్తోంది. సమకాలీక నటులతో పోల్చుకోవడం తప్పనిసరని అనుకుంటున్న శ్రద్ధ...అందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు....

రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ బురద పూసుకోలేను ! -కమలహాసన్

కళాకారుడనే పదానికి నిలువెత్తు నిదర్శనం కమలహాసన్. ఆరు పదులకు చేరువవుతున్న ఈయన ఐదు దశాబ్దాలు గా నటనా రంగంలో కొనసాగుతున్నారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నటులు ఇతరత్రా దృష్టి సారించడం పరిపాటి. అయితే కమల్ తన జీవితాన్నంతా నటనా రంగానికే అంకితం చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో తన మనసులోని భావాలను వెల్లడించారు....

Friday, October 11, 2013

'రామయ్యా వస్తావయ్యా' చిత్ర సమీక్ష

'రామయ్యా వస్తావయ్యా'   చిత్ర సమీక్ష      2. 5 / 5


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై హరీష్‌శంకర్‌ దర్శకత్వం లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు


 ఎప్పుడూ నలుగురు అల్లరిచిల్లరి కుర్రాళ్ళను వెంటేసుకుని కాలేజీ పేరుతో అమ్మాయికి సైట్‌కొట్టేవాడు నందు (ఎన్‌టిఆర్‌ ). వేరే కాలేజీలో చదివే ఆకర్ష (సమంత) ఆకర్షణ కు  లోనై ఆమెను లైన్లే పెట్టడానికి రకరకాలుగా టీజ్‌ చేస్తుంటాడు. ఓసారి ఆ అమ్మాయిని కాపాడతాడు. దానితో తన అక్క పెళ్లికి నందును తన ఊరు తీసుకెళుతుంది ఆకర్ష. చట్టవ్యతిరేక వ్యాపారాలుచేసే ముఖేష్‌రుషికి.. శత్రువులునుంచి ప్రమాదం ఉండడంతో కూతురు పెళ్లికి కూడా..కార్డుఉంటేనే రానిస్తాడు. ఆకర్షతోపాటు వచ్చిన నందు... చిన్న ట్విస్ట్‌ఇచ్చి.... ఆమె తండ్రిని చుట్టుపక్కల అనుచరుల్ని చంపేస్తాడు. ఈ కేసును పోలీసుఆఫీసర్‌ రావురమేష్‌ డీల్‌ చేస్తూ... నందునే మీ నాన్నను చంపాడని  ఆకర్షకు చెప్పేస్తాడు.  మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచివాడుకాదని- ఫ్లాష్‌బ్యాక్‌లో కథ చెబుతాడు హీరో . అదే సినిమా...

'గబ్బర్‌సింగ్‌' తర్వాత హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమా, మాస్‌ హీరో ఎన్‌టిఆర్‌ కాంబినేషన్‌లో రావడంతో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంపై ఓ క్రేజ్‌ ఏర్పడింది. తెలుగు సినిమాలకు ఒకటే ఫార్మెట్‌ ఉందని దర్శకులు నిర్మాతలు నమ్మి సినిమాలు  తీస్తున్నారు.  నవరసారలపేరుతో అన్నింటిని కలిపి ఇదే చక్కటి భోజనం అంటూ.. వారే చెప్పేస్తున్నారు.  కొత్త పోకడలతో హీరోలను చూపించే ఒరవడిలో కథను రాసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు కథలంటూ ప్రత్యేకంగా ఉండవు. సీన్‌నుబట్టి.. డైలాగ్‌లు,... దాన్నిబట్టి.. నడిపిస్తూ  పోతుంటారు. హరీష్‌శంకర్‌ ఈ చిత్రం కథ గురించి అడిగితే.. అదే చెప్పాడు .'కథంటూ పెద్దగా చెప్పడానికి ఏమీలేదు. చూడాల్సిందే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమానే తీశాను. ఏదో ఉద్దరిద్దామని కాదంటూ'  వల్లించాడు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే.... హీరోయిన్‌ను టీజింగ్‌ చేయడం, బామ్మలచేత నాట్యం చేయించడం...కత్తులు కటారులతో కాళ్లు చేతులు నరకడమే?- అనే  కొత్త అర్థం వచ్చేలా ఈ చిత్రం లో చూపాడు . 

 పాత్రకు అనుగుణం గా  ఎన్‌టిఆర్‌ ...  ఎక్కడ ఏ ఎమోషన్స్‌ పలికించాలో... ఎక్కడ ఎలా డాన్స్‌ చేయాలో... ఎక్కడ డైలాగ్స్‌ ఎత్తుపల్లాలు పలకాలో అన్నీ బాగా చేశాడు. సమంత కూడా తన టాలెంట్‌ను పాత్ర లో  చూపించేసింది. ఫ్యాష్‌బ్యాక్‌లో వచ్చే శ్రుతిహాసన్‌ పాత్ర కొత్తదనంలేకపోయినా, రొటీన్‌ పార్మెట్‌లో చేసేసింది. తనికెళ్ళభరణి టీచర్‌గా , ముఖేష్‌రుషి కరడుగట్టిన వ్యాపారవేత్తగా నటించాడు. చిత్రంలో హైలైట్‌గా- మళ్ళీ అరుంధతి తరహాలోనే 'నచ్చింది కనపడితే చెంతచేరాలనే' పాత్రను మళ్ళీ రవిశంకర్‌ బాగా  పోషించాడు. అతని తండ్రిగా కోటశ్రీనివాసరావు పాత్ర చిన్నదే. పోలీసు అదికారిగా రావురమేష్‌ సరిపోయాడు. తనికెళ్ళ భరణి ,  రోహిణీ హట్టంగడి, అజయ్ కూడా ఇందులో వున్నారు.

చోటా  కె నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్రానికే  ప్రత్యేక ఆకర్షణ .   థమన్‌ సంగీతం లో పాటలు గొప్పగా కాకున్నా కొన్ని  బాగున్నాయి .   బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో  కొంత గందరగోళం  చేశాడు.   'జాబిల్లి నువ్వే చెప్పమా...' అనే పాటను ఎంతో అందంగా తీస్తే బాగుండేది... జాబిల్లి సాంగ్‌లో వీధిలైట్లను పెట్టి తీయడం అతకలేదు.  ఎడిటింగ్‌ విషయంలో ఇకాస్త జాగ్రత్తపడాల్సింది. రొటీన్  కత్తిఫైట్లు... నరుక్కోవడాలు ఇంకా ఎడిట్‌ చేయాల్సింది. డైలాగ్స్‌ విషయంలో కొత్తదనం ఏమీలేకపోగా....' బుడ్డోడు' అనే మాటను ఎన్‌టిఆర్‌ చేత అనిపించి... ఫైట్స్‌ చేయించడం... ఒక్కటే కొత్తగాఅనిపిస్తుంది.

  పెద్ద హీరోలతో సినిమా చేయడం అంటే... ఏదో రకంగా తీసేస్తే... చాలు జనాలు చూసేస్తారనుకోవడం చాలా పొరపాటు.  ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అంటే -  దర్శక నిర్మాతలకు, హీరోకు నచ్చింది చేయడమే అనుకుంటే ... అంతకంటే పొరపాటు..' నాకు నచ్చింది..  నాకు వచ్చింది..  చేయడం నా పాలసీ' అన్న హరీష్‌శంకర్‌ ప్రేక్షకుల్నీ దృష్టిలోపెట్టుకోవాలి. సమాజాన్ని బాగుచేయకపోయినా పర్వాలేదు. చెడగొట్టకూడదు అనే పాలసీని నమ్మి సినిమాలు తీయాలి.  గబ్బర్‌సింగ్‌ సినిమా తీసింది ఈయనేనా అనిపిస్తుంది.  కానీ ఇందులో కేవలం వ్యక్తిగత పగ, ప్రతీకారం నేపథ్యంలోసాగుతుంది.ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో రోహిణిహట్టంగల్‌తో ఎన్‌టిఆర్‌ను లవ్‌చేయడం, డాన్స్‌ చేయడం, తర్వాత మనవడు అంటూ సెంటిమెంట్‌ పలకడంవంటివి పెద్దగా వర్కవుట్‌ కాలేదు.  కధ లో విషయం తక్కువ ... హీరో బిల్డప్పులో మాత్రం చాలా ఎక్కువ .  సంభాషణల్లో పంచ్‌లకోసం ప్రాకులాడేకన్నా...కథ, కథనంలో కొత్తదనాన్ని చూపడం  చాలా అవసరం.  మొదటిభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాగానే వుందనిపిస్తాడు దర్శకుడు .సెకండాఫ్‌లో కథ ప్రారంభమవుతుంది. ఇందులోఎక్కువ ఎమోషన్స్‌  ఉన్నాయి. కానీ అయినా దేనికీ  ప్రేక్షకుడు కనెక్ట్‌కాలేడు. 'నరసింహుడు', 'దమ్ము' చిత్రాలు గుర్తుకువస్తాయి. భారీగా తీస్తే సరిపోదు.. ఇందులో చాలావిషయాలు  లాజిక్కులకు అందవు. ఏ లాజిక్కులు లేకుండా చట్టం అంటే ఎలా ఉండాలి.అంటూ స్పీచ్‌లు చెప్పేస్తే సరిపోదు. బొమ్మరిల్లు, బృందావనం వంటి చిత్రాల్లో కుటుంబ సంబంధాలు ,  మానవీయతను టచ్‌చేసి కాస్త హాస్యపు గుళికలతో ఆకట్టుకున్న  నిర్మాత దిల్ రాజు  ఎన్‌.టిఆర్‌తో - పగ, ప్రతీకారం...చంపడం, నరకడం వంటి అంశాలు పెట్టి  ఆకట్టుకోవాలనుకోవడం  తప్పే   
                                                                                                  -రవళి 

Friday, October 4, 2013

100 కోట్ల క్లబ్‌లోకి తెలుగు సినిమా ?

బాలీవుడ్‌ 100 కోట్ల క్లబ్‌ను దాటి.. 300కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ 100కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా? అన్నదే ప్రశ్న. అయితే ఒకేసారి మనం అంత రేంజుకి వెళ్లిపోవడం కష్టమే. మన సినిమా పూర్తిగా ప్రాంతీయం. వేరే భాషల్లో మన హీరోలకు క్రేజు పెరగ లేదింకా. తెలుగు హీరోలకు ఇతర భాషల్లో మార్కెట్‌ పెంచుకునే వ్యూహం కొరవడడం వల్లే ఈ వెనుకబాటు తనం అని ఎప్పట్నుంచో విశ్లేషకులు విమర్శిస్తూనే ఉన్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌, మహేష్‌ లాంటివాళ్లకు...

కపూర్లు ఎంతో దయ చూపారు! -పల్లవీ శారద

రణ్‌బీర్ కపూర్‌తో పాటు అతని తల్లిదండ్రులు రిషి, నీతూ కపూర్‌లతో కలిసి నటించే అవకాశం కలగడం తనకు అదృష్టమని ఆస్ట్రేలియాలో పుట్టిన భారతీయ నటి పల్లవీ శారద అంటోంది. వీరందరూ కలిసి 'బేషరమ్' సినిమాలో నటించాను . 'మై నేమ్ ఇజ్ ఖాన్',' హీరోయిన్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తనకు బాలీవుడ్‌లో ఇంత పెద్ద నటీనటులతో కలిసి ప్రాధాన్యత గల పాత్రలో నటించే అవకాశం లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కపూర్ కుటుంబం తనపట్ల....

సంతోషం కంటే సవాల్‌గానే తోచింది ! -వాణీకపూర్.

 నటనలోఅనుభవం లేకపోవడం వల్ల 'శుద్ధ్ దేసీ రొమాన్స్' షూటింగ్ సమయంలో చాలా కంగారు పడ్డానని చెప్పింది ఢిల్లీ యువతి వాణీకపూర్. ఇందులో సుశాంత్‌సింగ్, పరిణీతి చోప్రా ప్రధానపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జైపూర్ నేపథ్యంగాసాగే ఈ ప్రేమకథను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆడిషన్‌లో అందరినీ మెప్పించిన వాణికి ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ నుంచి ఎందరో పెద్ద నటులుగా ఎదిగారని, అందుకే షూటింగ్ సమయంలో ఎంతో బాధ్యతగా నడుచుకున్నానని....

రోబోలా నటించాను! -ఇలియానా

ఇలియానా డిసౌజా...అంటే పెద్దగా గుర్తుపట్టరు. కానీ ఇలియానా..అని కనబడ్డా, వినపడ్డా..థియేటర్‌కు ప్రేక్షకుడు తప్పక వస్తాడు. పొగురున్న అందమైన యువతిగా, తనదైన వ్యక్తిత్వంతో నడిచే కథానాయికగా తెరపైనే కాదు, తెరవెనుకా అదే తరహా అన్న సంగతి..ఇలియానా గురించి తెలిసినవారు చెబుతారు. సున్నితమైన, భావోద్వేగమైన మనస్తత్వం గల నటి ఇలియానా. ప్రతీ విషయంపై స్వతంత్ర భావాలతో అవగాహన కల్పించిన కుటుంబనేపథ్యం ఉండటం వల్ల ఆధునిక యువతిగా....

రంగు కాదు, విజయాలే ప్రధానం! - నందితా దాస్‌

నల్లగా ఉన్నావని ఎవరైనా అంటే ఏదో జరగరానిది జరిగి పోయినట్లు బాధపడిపోనని నందితా దాస్‌ అంటారు. కానీ తనను ఒంటి రంగును బట్టి పిలవడం ఏమిటని క్షణ కాలం ఆశ్చర్యపోతారు. తనలో అంతకంటె ఎన్నో చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నపుడు మేని ఛాయను బట్టి పిలవడం తప్పని గట్టిగా చెబుతారు. ఎవరి విషయంలోనైనా అలా మాట్లాడడం తప్పేనంటారు. ఒక మనిషి తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అన్నది ఆ మనిషి వ్యక్తిత్వంలో భాగం కానేకాదని....

Thursday, October 3, 2013

ఆత్మ పరిశీలన చేసుకోవాలి!-గౌతమ్‌ ఘోష్‌

తాజాగా ఆస్కార్‌లో విదేశీ చలనచిత్ర విభాగంలో భారతీయ ఎంట్రీని ఎంపిక చేసిన జ్యూరీకి నేను అధ్యక్షుణ్ణి. సినిమాల స్క్రీనింగ్‌లో వచ్చిన వివిధ భాషా చిత్రాలను ఇతర సభ్యులతో కలసి చూశాను. అలా తెలుగు ఎంట్రీలను కూడా చూడడం జరిగింది. తెలుగు సినిమా ప్రమాణాలు బాగా లేవని అభిప్రాయ పడ్డాను -అని అంటున్నారు 'మా భూమి' చిత్రదర్శకుడైన గౌతమ్‌ ఘోష్‌ . విదేశీ చలనచిత్ర విభాగంలో ఆస్కార్‌ అవార్డుకు తుది భారతీయ ఎంట్రీగా తాజాగా గుజరాతీ చిత్రం 'ది గుడ్‌ రోడ్‌'ను ఎంపిక చేసిన జ్యూరీకి....

Friday, September 27, 2013

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష     3.75/5

           శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై రిలయన్స్ వారి సమర్పణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన,దర్శకత్వంలో బి .వి .ఎస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .


           ఇటలీలోని మిలాన్ లో రఘు నందా పెద్ద  బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. 'ఆరడుగుల బుల్లెట్' లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. రఘు నందాకు  ఒక చివరికోరిక వుంటుంది. తనకు ఇష్టంలేకుండా వేరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో తన కూతురు సునంద ను ఇల్లు వదిలి  పొమ్మన్నానని అనుక్షణం బాధపడుతూ వుంటాడు. తను చనిపోయేలోపు కన్న కూతురుని కళ్ళారా చూడాలనివుందని అడగితే- తాత  కోరిక నెరవేర్చడానికి హైదరాబాద్ కు చేరుకుంటాడుగౌతమ్సునంద ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు.అలా వచ్చిన గౌతంకు తన మరదళ్ళు అయిన శశి, ప్రమీల లతో ఎలాంటి ప్రేమ బంధం ఏర్పడింది? తండ్రి అంటే మండి పడుతున్న  సునందలో మార్పు తీసుకురావడానికి ,  తాత కోరికను తీర్చడానికి  గౌతమ్ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ...   

కనుల పండువగా వుండే భారీసినిమాలు కరువై  
అవురావురుమంటున్న   తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ‘అత్తారింటికి దారేది’. పవన్ కళ్యాణ్ హీరో ఇమేజ్ కి  , త్రివిక్రమ్ జనరంజక రచనా - దర్శకత్వ ప్రతిభ కలిసి...కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన   ఈ చిత్రం ప్రేక్షకులకు,  పవన్ కళ్యాణ్ అభిమానులకు  మంచి  వినోదాన్ని అందిస్తుంది . 
       పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగా  సరిపోయే విధంగా గౌతమ్ నందా పాత్ర ను  దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విశేషంగా ఆనందింపజేస్తాయి. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' వంటి  త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా వున్నాయి . త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం...స్క్రీన్ ప్లే వేగంగా,పట్టుగా లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ఆ ఇబ్బందిని మర్చి పోయేలా చేసాయి . అలాగే రచయితగా త్రివిక్రమ్  ప్రాసకోసం,పంచ్ ల కోసం ఒక్కోసారి సందర్భ ఔచిత్యాన్నిమర్చిపోవడం కనిపిస్తుంది . సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన 'అహల్య'  ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకుతప్ప...మిగతా ప్రేక్షకులకు బాగా ఇబ్బంది పెట్టాయి .   ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్.   క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రం స్థాయిని పెంచాయి . 
              రఘునందా గా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలోచక్కగా  నటించాడు.'మిర్చి' చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందగా    ప్రధాన పాత్రలో  ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు.  పోసాని సన్నివేశాలు కూడా బాగున్నాయి . ఇతర పాత్రల్లో మోహన్ రుషి , రావు రమేష్ ,అలీ , ఎమ్మెస్ నారాయణ , రఘుబాబు , కోట , డా" భరత్, కాదంబరి కిరణ్ , పృథ్వి , ప్రదీప్ నటించారు . 
      
         దేవి శ్రీ ప్రసాద్ఈ చిత్రానికి  అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది . రామజోగయ్య శాస్త్రి రాసిన 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు,  దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే', శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. ఆడియోకు  ధీటుగా పాటల  చిత్రీకరణ కూడా వుండటం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ . పీటర్ హైన్స్ వెరైటీ ఫైట్స్ అందించారు .  ప్రసాద్ మూరెళ్ల తన ఫోటోగ్రఫీ తో  యూరప్ అందాలను చక్కగా చూపడమే కాకుండా,కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు.ఒక పాటలో దేవిశ్రీ ప్రసాద్ , మరోపాటలో ముంతాజ్, హంసనందిని కనిపించడం విశేషం                    -రాజేష్ 

Saturday, September 21, 2013

శృంగార దృశ్యాలకూ సిద్ధం !

తప్పనిసరైతే శృంగార దృశ్యాల్లో నటించేందుకైనా సిద్ధంగానే ఉన్నానని, సినిమాల్లో పాత్రలకు సంబంధించి తన ఉద్దేశాలపై వివాహం ఎటువంటి ప్రభావమూ చూపలేదంటూ కుండబద్దలు కొట్టింది నటి కరీనాకపూర్. ‘పెళ్లికి అటువంటి పాత్రలకూ ఎటువంటి సంబంధమూ లేదు. కెరీర్‌ను పెళ్లికి, ప్రేమకు కొంతమంది ఎందుకు ముడిపెడతారో నేను అర్ధం చేసుకోలేకపోతున్నా’ అని పేర్కొంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఓంకార’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో శృంగార దృశ్యాల్లో....

పెళ్లి చేసుకుంటామని ఎందరో...

రెండుసార్లు చేదు అనుభావాల్ని చవిచూసిన ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు తావు లేదని స్పష్టం చేసింది. ప్రేమ అనే రెండు అక్షరాలు ఆమె జీవితంలో ఒకసారి కాదు.... రెండుసార్లు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. భగ్న హృదయంతో నయనతార తన కెరీర్ మీదే దృష్టి పెట్టింది. నటిగా ఆమె సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతోంది. అయితే యువ హీరోల రూపంలో ప్రేమ మళ్లీ నయనను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. నయనతార తనకు ప్రత్యేక స్నేహితురాలు అంటూ హీరో ఆర్య బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు ఆమెను ఇంటికి తీసుకెళ్లి...

బుల్లితెర ఫై 100కోట్ల 'మహాభారతం'

బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ సెప్టెంబర్ 16నుంచి ప్రేక్షకుల ముందుకు....

'త్వరలో దక్షిణాది సినిమాకూ రూ.100కోట్ల వైభవం'

త్వరలో దక్షిణాదిసినిమా వందకోట్ల మార్క్ ను దాటుతుందని ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మైలురాయిని చేరుకోవడం గగనంగా మారిందన్నాడు. బుధవారం ఐఎన్ ఎస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో నాగార్జున పలువిషయాల్ని పంచుకున్నారు. బాలీవుడ్ ఇప్పటికే ఆస్థానాన్ని అందిపుచ్చుకోగా, దక్షిణాది సినిమా మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని తెలిపారు. ఆ భర్తీ త్వరలో పూర్తి చేస్తామనే ధీమాను....

'రాజకీయాల్లోకి రా.. కథానాయకుడా'


సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారత సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడు రజనీకాంత్. ఆయన రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఓ సంకేతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయూంశమైంది. రాజకీయ సంకేతంగా ఆయన గళం విప్పడం అభిమానుల్లో ఉత్తేజం నింపింది. తర్వాత విడుదలైన చిత్రాల్లో రాజకీయ డైలాగులు పేలడంతో రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, రావాల్సిన సమయంలో వస్తా ....

నాటకరంగానికి 'అక్కినేని నాటక కళా పరిషత్‌' ప్రోత్సాహం !


అభినయ రంగంలో అన్ని మెట్లూ అధిరోహించిన 90 ఏళ్ల అక్కినేని నుంచి అభినందనలు, బహుమతులు అందుకునే అవకాశం కల్పించే 'డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నాటక పరిషత్‌ కళా 'కు 20 ఏళ్లు వచ్చాయి. నటనా రంగంలో వెలుగులు విరజిమ్మిన ప్రతిభావంతులలో ముందు పేరుగా చెప్పుకునే అక్కినేని నాగేశ్వరరావు పేరిట అభిమానులు రాష్ట్ర రాజధానిలో నాటకాల పోటీలను ఆ పరిషత్తును నిర్వహిస్తున్నారు. 1929లో మొదలై పోటీ నాటకాలకు ఒరవడి దిద్దిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు స్ఫూర్తితో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ తెలుగు నాట ప్రతిష్టాత్మక పరిషత్తుగా...

వందేళ్ళ సినిమాకు డాక్యుమెంటరీ నీరాజనం!

భారతీయ సినిమా పరిశ్రమ వందేళ్ల పండగ చేసుకుంటున్న సమయమిది. ఒక సినిమావ్యక్తిగా సినిమాప్రియులకు ఏం కానుక చెయ్యాలని ఆలోచిస్తుంటే - ఇదివరలో తెలుగు సినిమా ప్రముఖుల గురించి తాను రూపొందించిన విలువైన డాక్యుమెంటరీలు గుర్తొచ్చాయి సీనియర్ నటుడు సాయిచంద్‌కు. వాటిని పదిమందికీ ప్రదర్శించి, సమాజానికి అంకితమివ్వడం కన్నా మంచి పనేముంటుంది? 'చలో, అదే చేద్దాం' అని బయల్దేరారు సాయిచంద్....

సవాలు విసిరే పాత్రల కోసం...

ముద్దంటే మాకేమైనా సరదానా ?

మామూలుగా ఒక ముద్దు సీన్‌ ఉంటేనే సినిమాకి అది పెద్ద హైలైట్‌ అయిపోతుంది. ఆ సీన్‌ గురించి గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 ముద్దు సీన్లతో ఇప్పుడు కొత్త రికార్డు కొడుతోంది..బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా కజిన్ పరిణితి చోప్రా. తను తాజాగా నటించిన 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇన్ని ముద్దులకి సై అంది. 'సినిమా కథ అటువంటిది. అన్ని ముద్దు సీన్లు డిమాండ్‌ చేసింది. లేకపోతే చేయడానికి మాకేమైనా సరదానా ? అంటోంది తెలివిగా ఈ చిన్నది. మరి, ఈ సన్నివేశాలలో పరిణితి చోప్రా ఎంతటి పరిణితి చూపిందో తెలియాలంటే ఇటీవల రిలీజయిన ఈ సినిమా చూడాల్సిందే !

Saturday, September 14, 2013

' పోటుగాడు' చిత్ర సమీక్ష

                                     ' పోటుగాడు' చిత్ర సమీక్ష      2. 75 / 5

నటీనటులు: మంచు మనోజ్‌, సాక్షి చౌదరి, సిమ్రాన్‌కౌర్‌ముండి, రేచల్‌ వెయిన్‌, అనుప్రియ గొయాంక, పోసాని కృష్ణమురళి, అలీ, షిండే, సత్యంరాజేష్‌, గీతాసింగ్‌
నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్‌,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్‌ వడయార్‌.

           అల్లరి కుర్రాడు గోవిందం (మంచుమనోజ్‌). ప్రేమించడం అతని అలవాటు. అలా అని అందరినీ పెళ్లి చేసుకోడు. ఇప్పటి యూత్‌కు తగినట్లు యూజ్‌అండ్‌ త్రో అన్నమాట. అలా ఆయన జీవితంలో వచ్చిన వైదేహి, ముంతాజ్‌, ప్రియ, రేవల్‌ అనే నలుగురు అమ్మాయిల్ని ప్రేమించేస్తాడు. అయితే ఎవ్వరినీ సరిగ్గా ప్రేమించడు. ఈ విషయం తెలిసి అందరూ అసహ్యించుకుంటారు. దాంతో ఆత్మహత్య చేసుకోవడానికి కెండెక్కుతాడు. సరిగ్గాఅక్కడే జీవితంలో రాకరాక వచ్చిన ఓ ప్రేమికురాలి చేతిలో మోసపోయిన వెంకట్‌ (పోసాని కృష్ణమురళి) కూడా వచ్చి ఆత్మహత్యచేసుకోవాలనుకుంటాడు. ఒకరినొకరు   తామెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో చెప్పుకుంటారు.  ఆ కథలు వెండితెరఫై  చూడాల్సిందే.

           సినిమాను తీయాలంటే యూత్‌ను ఎట్రాక్ట్‌ చేయడమే  లాజిక్కు. ఫ్యామిలీ చిత్రాలు తీసి పాసైనా కలెక్షన్లురాక ఇబ్బంది పడ్డానన్న లగడపాటి శ్రీధర్‌ ఇప్పుడు యూత్‌ను దృష్టిలో పెట్టుకుని 'పోటుగాడు' తీశాడు. మాతృక కన్నడ 'గోవిందాయ నమ:' చిత్రాన్ని చూసి అందులో 'ప్యార్‌మే పడిపోయా..' పాట నచ్చి చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చాడంటే- అందులో ఏదో ఆకర్షణ ఉందనేగా.   కెరీర్ ప్రారంభం నుండీ చాలా ప్రయోగాలు చేసినా  మంచు మనోజ్‌కు సరైన సక్సెస్‌లేదు. అయితే 'పోటుగాడు' మాత్రం ఒక ఫార్ములా ప్రకారం మాస్‌ ప్రేక్షకుల కోసమే చేసారు కనుక, మంచి వసూళ్ళే  సాధించ వచ్చు . సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల  పెద్ద సినిమాల పోటీ  లేకపోవడం కూడా కలిసొచ్చింది.   ఎంటర్‌టైన్‌ మెంట్‌పేరుతో పాత్రకు తగ్గట్టు  ఎనర్జిటిక్‌గా మనోజ్‌ నటించాడు. మిగిలిన పాత్రల నిడివి పెద్దగా లేకపోవడంతో సినిమా అంతా  మనోజే కన్పిస్తాడు. దానితో ఒక్కోసారి విసుగు పుడుతుంది కూడా. అల్లరిగా తిరిగే వ్యక్తి- జీవితంలో ఎదురైన అనుభవంతో మళ్ళీ మంచివాడుగా మారడం అన్న పాయింట్‌ పాతదే అయినా... ప్రజెంట్‌ చేసే విషయంలో దర్శకుడు పవన్‌ కొత్తగా చేశాడు. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా స్క్రీన్‌ప్లే మలిచాడు.                                           

       ఇది మనోజ్‌ ఒన్‌మేన్‌ షో. సినిమా మొత్తం మనోజ్‌ లేని సీన్‌ అంటూ ఉండదు. తన అతి నటనతో డాన్స్‌, ఫైట్స్‌ ఇరగదీశాడు.ఇందులో  మనోజ్‌, పోసాని పాత్రలే కీలకం. ఇద్దరూ చిత్రాన్నితమ  భుజాలపై మోసేశారు. హీరోయిన్లుగా చేసిన నలుగురు అమ్మాయిలు కొత్తవారే. వారిలో ఉన్నంతలో ముంతాజ్‌గా  నటించిన సాక్షి చౌదరి బాగుంది.   మిగిలిన పాత్రల్లో షిండే, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి పాత్రలు మోస్తరుగానే ఉన్నాయి. రాజేష్‌, గీతాసింగ్‌ పాత్రలు ఉన్న కొన్నిసెకన్లయినా కొద్దిగా నవ్వించే ప్రయత్నం చేశారు.అయితే , హీరో -హీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడే సన్నివేశాలు రొటీన్ గా వున్నాయి . హీరోయిన్లతో  హీరో ప్రేమ ను ఎందుకు వాదులు కోవాల్సి వచ్చిందీ? చూపే కారణాలు కన్విన్సింగ్ గా లేవు . అనుభవం గల డైలాగ్  రైటర్‌ శ్రీధర్‌ సిపాన బాగానే రాశాడు. అక్కడక్కడా  కొన్నిడబుల్ మీనింగ్  మాస్  మసాలాలు వాడుకున్నాడు . దాంతో వాటిలో కొన్నింటికి  బీప్‌ సౌండ్‌లు వచ్చేశాయి. సంగీతపరంగా అచ్చు ఓల్డ్‌ఈజ్‌ గోల్డ్‌ తరహాలో పాత మెలోడీని రుచిచూపించాడు. 'ప్యార్‌లో పడిపోయానే..' అనే పాట వినడానికి చాలా బాగుంది.శ్రీకాంత్  ఫొటోగ్రఫీ బాగుంది. రోప్‌షాట్స్‌, రిస్కీషాట్స్‌లో మనోజ్  పనితనం బాగుంది .    -రవళి 

Friday, September 6, 2013

'తుఫాన్' చిత్ర సమీక్ష

                                          'తుఫాన్' చిత్ర సమీక్ష         2/5

                                      నిర్మాణసంస్థ: రిలయన్స్‌, లాఖియా సంస్థ... దర్శకత్వం: అపూర్వ లఖియా.

                           నటీనటులు: రామ్‌చరణ్‌, శ్రీహరి, ప్రియాంకచోప్రా, మహీగిల్‌, ప్రకాష్‌రాజ్‌,అతుల్ కులకర్ణి తదితరులు


       విదేశాలనుంచి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ వివాహంకోసం ముంబై వస్తుంది మాల (ప్రియాంకచోప్రా). వేడుక రాత్రి తిరిగి వెళుతుంటే ఓ చోట హత్యను కళ్ళారా చూస్తుంది. ప్రత్యక్షసాక్షిగనుక కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేస్తుంది.  చనిపోయింది డిప్యూటీకలెక్టర్‌ గనుక ఆ విషయాన్ని పోలీసు వ్యవస్థ సీరియస్‌గా తీసుకుంటుంది. అప్పటికే ఏదేళ్ళలో 22సార్లు ట్రాన్స్‌ఫర్లు కాబడ్డ విజయ్‌ఖన్నా (రామ్‌చరణ్‌) ముంబైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతారు. తన పరిధిలో కాబట్టి అతనికి కమీషనర్‌ కేసు బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రత్యక్షసాక్షి గనుక మాలను కోర్టుకు రమ్మని విజయ్‌ఖన్నా ఆహ్వానించడంతో , చనిపోయిన పిల్లల సెంటిమెంట్‌తో ఆమె సహకరించడానికి అక్కడే ఉంటుంది. కేసులో భాగంగా కార్లను  మార్ట్‌గేజ్‌ చేసే షేర్‌ఖాన్‌ (శ్రీహరి)తో స్నేహం పెంచుకుంటాడు విజయ్‌ఖన్నా. అతని ద్వారా ఆయిల్‌ మాఫియా మూలవిరాట్‌ రుద్రప్రతాప్‌ తేజ (ప్రకాష్‌రాజ్‌)ను టార్గెట్‌ పెడతాడు ఎసీపీ. అయితే  తేజ వేసిన ప్లాన్‌తో ఏసీపీ సస్పెండ్‌ అవుతాడు. ఆ తర్వాత పోలీసు దుస్తులులేకుండానే   తేజను ఎలా మట్టుపెట్టాడు?  అనేది కథ.

       పోలీసు నేపథ్యంలో కథలు తెలుగు తెరకు కొత్త  కాదు. ఇదివరకు చాలానే వచ్చాయి. సమసమాజమే లక్ష్యంగా పోలీసు విధినిర్వహణలో పోరాటం చేయాలని  పోలీసు అధికారి  వాదిస్తుంటాడు. సంఘవిద్రోహశక్తులపై పోలీసు తన తూటాను ఎక్కుపెడుతుంటాడు. వారి మధ్య పోరాటం, సంఘర్షణ వంటి అంశాలతోనే ఆ సినిమాలు తెరకెక్కుతాయి. మధ్యలో సెంటిమెంట్‌ కోసం కొన్ని సన్నివేశాలు, ప్రేమ కోసం కథానాయికను ఉపయోగించుకుంటారు. నమ్మకద్రోహంకోసం పోలీసుల్లోనే ఓ వ్యక్తి సంఘవిద్రోహులకు తోడ్పాడు ఇవ్వడం అన్నీ మామూలే. అయితే ఒకప్పుడు ఇటువంటి కథను హిందీలో అమితాబ్‌ చేసి 'జంజీర్‌'తో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే కథను రీమేక్‌గా తీయడం సాహసమే. అందులోనూ పోలీసు అంటే పవర్‌ఫుల్‌గానూ, చక్కని శరీరధారుఢ్యం, ఎమోషనల్‌గా చూసిన కొన్ని పాత్రలను  రామ్‌చరణ్‌చేస్తే  ఎలా ఉంటుంది? అనేదే  ఇందులో కొత్తవిషయం.

      అపూర్వలాఖియా అనగానే బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. 'జంజీర్‌'కు రీమేక్‌ అనగానే ఏదో కొత్తదనం ఉంటుందని వెళ్ళంకానీ.. రామ్‌చరణ్‌ ఎలా చేశాడనే ఆసక్తి సహజం . 78లో అప్పటి ట్రెండ్‌కు తగినట్లు వున్న ఈ చిత్రాన్ని  చూసి, ఇప్పటి రామ్‌చరణ్‌ను అమితాబ్ తో  పోల్చలేరు. నేటి జనరేషన్‌కోసమే ఈ చిత్రాన్నిచాలా మార్పులతో  దర్శకుడు రీమేక్‌ చేసినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. కథలో నవ్యత కోసం ఆయిల్‌ మాఫియాను తీసుకున్నాడు.
     రొటీన్ కధతో , వెరైటీ  ట్విస్ట్‌లు లేకుండా... ఇప్పటి ట్రెండ్‌లో  ప్రేక్షకులను మెప్పించడం కష్టమే . ఏ ప్రత్యేకతలు లేని  ఈ చిత్రం ఎంతో అంచనాలను పెంచి...  చివరికి ప్రేక్షకులకు హింస నే మిగిల్చింది .  హిందీలో రామ్‌చరణ్‌ ప్రవేశ మంటూ .. ప్రచారాన్ని  ఉపయోగించుకున్నా...పరాజయాన్నే పొందారు .  రామ్‌చరణ్‌ ఏసీపీగా సరిపోయినా... కథానాయిక అతన్నిమించిన ఎత్తు ఉండడం ప్రధాన లోపంగా కన్పిస్తుంది. రామ్‌చరణ్‌  ఎమోషన్స్  అన్నీ పలికించినా ...ఎక్కడా ఫీల్‌ కలిగించలేదు . ఏదో డ్యూటీలో భాగంగా సీరియస్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడనే అనిపిస్తుంది. ప్రియాంక చోప్రా రొటీన్‌ అమ్మాయిలానే నటించింది. వాగుడుకాయలా ఆమె  కొత్తగా అన్పిస్తుంది. ప్రకాష్‌రాజ్‌, శ్రీహరి పాత్రలు ఇందులో కీలకం. షేర్‌ఖాన్‌ చిత్రానికి హెల్ప్‌ అయ్యేపాత్ర. అప్పట్లోప్రాణ్‌ పోషించిన పాత్రను శ్రీహరి చేశాడు.  హిందీలో సంజయ్‌దత్‌ చేశాడు. అయితే హిందీలో సంజయ్‌కు పాట ఉంది. ఇందులో లేదు.  చక్కటి  ట్విస్ట్‌ ఉన్న పాత్ర గనుక శ్రీహరికి మంచి మార్కులు పడ్డాయి. విలనిజంలో పలు షేడ్స్‌ చూపించే ప్రకాష్‌రాజ్‌ తన పాత్రని  అలవోకగా పండించాడు.  ఈ రెండు పాత్రలు మినహా చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీలేదు.

      సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో తెలుగువారికి కావాల్సిన హాస్యం లేకపోవడం   ప్రధాన లోపం. పంచ్‌ డైలాగ్‌ల పేరుతో కేవలం సన్నివేశపరంగా  రాసినవే. "భయంతో బతకవచ్చుకానీ, తప్పుచేశామని బతకడం కష్టం. అత్యాశలేనిదో ఎదిగే హక్కులేదు.. తుఫాన్‌ వస్తే తట్టుకోలేం.." వంటి డైలాగ్‌లు ప్రాసకోసం రాసినట్లు అనిపిస్తాయి. 'పోలీస్' అంటూ రామ్‌చరణ్‌ ఓ సన్నివేశంలో పలకడం... పేలవంగా అనిపించింది. వెంటనే 'పోకిరి'లో మహేష్‌బాబుఅన్న డైలాగ్‌ను థియేటర్లలో జనాలు గుర్తుచేసుకోవడం విశేషం. మరో సన్నివేశంలో .... ప్రియాంకచోప్రా రూమ్‌లోకి తన పోలీసుతో వచ్చిన రామ్‌చరణ్‌ను చూసి..."హోటల్‌ మేనేజర్‌వి.. పర్మిషన్‌ తీసుకుని రావాలని తెలీదా?" అని పలికిన డైలాగ్‌...కరెక్ట్‌గా సరిపోయిందనే కామెంట్లు విన్పించాయి. చంద్రబోస్‌ రాసిన  రెండు  పాటలు  సోసో సంగీతంతో   అంతగా ఆకట్టుకోలేదు. గురు రాజ్ ఫోటోగ్రఫీ పర్వాలేదు .                     -రవళి