RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, August 9, 2012

గురు ప్రసాద్(యువకళావాహిని) మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ

గురు ప్రసాద్(యువకళావాహిని) మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ

'యువకళావాహిని' ఆధ్వర్యం లోఆగస్ట్ 7న తెలుగు విశ్వ విద్యాలయంలో ' గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ-2012 ' ని  డా"అక్కినేని నాగేశ్వర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-కళలను,కళాకారులను ప్రోత్సహించడంలో' యువకళావాహిని' కృషిని అభినందించాలి. సాంస్కృతిక రంగానికి చెందిన ఎంతో మంది వివరాలు సేకరించి, ప్రతి ఏటా మీడియా డైరెక్టరీని  వెలువరించడం ఎంతో కష్టంతో కూడుకున్నది. అందరికి ఉపయోగపడేలా దీన్ని క్రమం తప్పకుండా వెలువరిస్తున్న వై.కే.నాగేశ్వర్రావును అభినందిస్తున్నానని -అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో ' గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ-2012 ' తొలి ప్రతిని గజల్ శ్రీనివాస్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య  ఎల్లూరి శివారెడ్డి, దూరదర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూదన్ రావు, హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్, ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్, రచయిత్రి డా"కే.వి.కృష్ణకుమారి, డా"శ్రీలత, 'కార్నేషన్' రాందొర,'ప్రగతి ప్రింటర్స్' అధినేత  పరుచూరి హనుమంతరావు, వై.కే.నాగేశ్వర్రావు  పాల్గొన్నారు. ఆశాశ్రీలత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో భాగంగా  పసుపులేటి రామారావు, రాంబాబు అడ్ల (సినీవినోదం.కాం)వంటి సీనియర్ జర్నలిస్టులను,ప్రముఖ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులను అక్కినేని చేతులమీదుగా సత్కరించారు.ఈసభ ప్రారంభంలో యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా నిర్వహించిన " డా"దాశరధి చిత్రగీతలహరి " లో చంద్ర తేజ, వీ.కే.దుర్గ, వీ.వీ.రామారావు.శారదారెడ్డి,సుహాసిని,వీణా రాజు,పద్మశ్రీ,నాగరాజప్రసాద్  పాల్గొన్నారు.

0 comments:

Post a Comment