RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, April 4, 2012

ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

                                            ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

ప్రముఖ  చిత్ర నిర్మాణ సంస్థ  జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు  వి.బి.రాజేంద్ర ప్రసాద్  80 ఏళ్ళ పండగ (అశీతి మహోత్సవం) ఏప్రిల్  3  న రవీంద్రభారతి లో 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు  ఆధ్వర్యం లో  వైభవం గా జరిగింది.  ఇదే వేదిక ఫై జగపతి సంస్థ నిర్మించిన 'ఆరాధన' చిత్రం  50 ఏళ్ళ వేడుక కూడా నిర్వహించారు. సారిపల్లి కొండల రావు అధ్యక్షత వహించిన ఈ సభలో- డా"సి. నారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాసు కృష్ణా రెడ్డి , అక్కినేని నాగేశ్వర్ రావు, డి.రామా నాయుడు, టి.సుబ్బరామి రెడ్డి, జమున ,వాణిశ్రీ,  ఏడిద నాగేశ్వర్ రావు, అక్కినేని రమేష్ ప్రసాద్, మురళీ మోహన్, పీ . చంద్ర శేఖర రెడ్డి , జగపతి బాబులు పాల్గొని జగపతి రాజేంద్ర ప్రసాద్ ను ఘనం గా సత్కరించారు. "రాజేంద్రప్రసాద్ మనసున్న  మనిషి .జగపతి పతాకం ఫై సకుటుంబంగా చూడదగ్గ చిత్రాలు ఎన్నో అందించారు. వారు నిర్మించిన చిత్రాలన్నీ కధ....సంగీత పరంగా మంచి  స్థాయి కలిగినవి . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డ్ ఇచ్చి సత్కరించడం ఎంతైనా అభినందనీయం" -అంటూ ఈ సందర్భంగా హాజరైన  ప్రముఖులు ప్రశంసించారు .ఈ సందర్భం గా- 'ఆరాధన' చిత్ర కధా నాయకుడు అక్కినేనిని,'అన్నపూర్ణ' చిత్ర  నాయిక జమునని,' దసరాబుల్లోడు' చిత్ర నాయిక వాణిశ్రీ ని సత్కరించారు. ఈ సభలో-యస్.వి .రామారావు వ్యాఖ్యానం తో  చంద్ర తేజ, విజయ లక్ష్మి, వినోద్ బాబు లు అందించిన 'జగపతి చిత్ర గీతమాలిక' ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

0 comments:

Post a Comment