నాయకురాలైన సినీ తార గా ప్రియాంక | |
బాలీవుడ్లో వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో ప్రియాంకచోప్రా ఒకరు. ప్రతి చిత్రంలో పాత్రపరంగా కొత్తదనాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతుందామె. ప్రస్తుతం భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న మేరీకోమ్ చిత్రంతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది ప్రియాంకచోప్రా.
ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె ఇటీవలే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మేడమ్జీ' చిత్రానికి ఓకే చెప్పింది. ఐటెంగర్ల్ స్థాయి నుంచి దేశరాజకీయాలను శాసించే నాయకురాలిగా ఎదిగిన ఓ సినిమా తార జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సన్నివేశాల పరంగా ఈ సినిమా స్క్రిప్ట్ తొలి భాగంలో దర్శకుడు మధుర్ బండార్కర్ శృంగార సన్నివేశాలకు ఎక్కువగా చోటుకల్పించినట్లు తెలిసింది. ఇటీవలే చిత్ర కథను విన్న ప్రియాంకచోప్రా ఈ సన్నివేశాలను పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేసిందని, వాటిని తగ్గించాల్సిందిగా మధుర్ బండార్కర్ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి మధుర్ బండార్కర్తో పాటు ప్రియాంకచోప్రా కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. |
0 comments:
Post a Comment