RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, July 10, 2014

                                        ‘దృశ్యం’ చిత్ర సమీక్ష  3.5/5
                     

                            సురేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై శ్రీ ప్రియ దర్శకత్వం లో డి. సురేష్ బాబు , రాజ్ కుమార్ సేతుపతి ఈ చిత్రాన్ని నిర్మించారు . 
                  
                  విజ‌య‌న‌గ‌రం ద‌గ్గ‌ర‌లోని   రాజవరం అనే ఊరిలో క‌థ మొదలవుతుంది. రాంబాబు (వెంక‌టేష్‌) అక్క‌డి పోలీసుస్టేష‌న్‌లో కూర్చొని ఉంటాడు. అప్పుడే డ్యూటీలోకి  వ‌చ్చిన కొత్త కానిస్టేబుల్ .. రాంబాబును చూసి.... ఈయ‌న‌వ‌ల్లే పోలీసుస్టేష‌న్ మొత్తం ట్రాన్‌ఫ‌ర్ అయింద‌ని చెబుతాడు. ఎందుకు అలా జ‌రిగింద‌నేది ఫ్లాష్‌బ్యాక్‌....   ఆ ఊరిలో జ్యోతి కేబుల్ నెట్వర్క్స్ పెట్టుకున్న రాంబాబు(వెంకటేష్) తన కుటుంబం... భార్య ఇద్ద‌రు పిల్ల‌లైన‌... (మీనా) ,అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్) లతో హ్యాపీగా జీవిస్తుంటాడు. రాంబాబు చాలా నిజాయితీ పరుడు. అదే ఊరిలో బాగా లంచాలకు మరిగిన వీరభద్రం(రవి కాలే)కి రాంబాబుకి అస్సలు పడదు.    కాగా,  ఒకరోజు స్కూల్ టూర్ నిమిత్తం అంజు .. ఓ ఊరు వెళుతుంది. అక్క‌డ ఐజి గీత ప్రభాకర్(నదియా) కుమారుడు వరుణ్ ఆడ‌వాళ్ళ ఫొటోలు తీస్తాడు. హైద‌రాబాద్ అమ్మాయి గొడ‌వ చేస్తుంది.  ఓసారి అంజు ఊరు వ‌చ్చిన వ‌రుణ్‌.... కనపడకుండా పోతాడు. దీనికి కార‌ణం రాంబాబే అయి ఉంటాడని వీరభద్రం ఐజీకి చెబుతాడు. దాంతో  అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? లేక  కావాలనే ఇరికించారా ? చివరికి రాంబాబు కుటుంబం  ఆ కేసు నుంచి బయటపడ్డారా?  అన్నది సినిమాలో చూడాల్సిందే.... 

                 మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ న‌టించిన  సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని  అదే పేరుతో రీమేక్ చేశారు. త‌మిళంలో సినిమాలు తీసే రాజ్ కుమార్ సేతుపతి తో డి. సురేష్ బాబు క‌లిసి నిర్మించారు.  మొద‌టిభాగం సాదాసీదాగా ప‌ల్లెటూరిలో ఓ కుటుంబం...  చుట్టూ ఉన్న ప్ర‌జ‌ల మ‌ధ్య సాగుతుంది. ఇంట‌ర్‌వెల్‌ ధ్రిల్లింగ్ గా   ఉంటుంది.  సెకండాఫ్‌లో అది కంటెన్యూ అవుతుంది.  థియేటర్స్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరి చేత 'వావ్' 'సూపర్బ్' అనిపిస్తుంది . ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించి చూపించడం ఇదే తొలిసారి కావడం వలన ఆడియన్స్ థ్రిల్ కి ఫీలవుతారు. సెకండాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా అందరూ సీట్లో నుంచి కదలకుండా  ఏం జరుగుతుందా? అని చూసేలా ఉంటుంది.  ఇది మళయాళ సినిమాకి రీమేక్ అయినా -యూనివర్సల్ కాన్సెప్ట్ కనుక , తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఉండే కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్, ఎమోషనల్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ అయితే , అలాగే రొటీన్ కి విభిన్నంగా కోరుకునే వారికి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే ఆసక్తికరంగా సాగే సినిమా చూడాలనుకునే వారిలో ఉత్కంఠని కలిగించే అంశాలు -ఈ సినిమాలో ఉండడం వలన అన్ని వర్గాల ప్రేక్షకులకు  బాగా నచ్చుతుంది. 

                ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన  వెంకటేష్ నడిపించారు . వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం కొత్తేమీ కాదు, కానీ ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. రాంబాబు పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు. 
అమాయ‌కుడిగానూ, తెలివిమీరిన వాడిగా బాగా చేశాడు. కేవలం నాల్గ‌వ‌త‌ర‌గ‌తి ప్యాస్ అయినా... లోక‌జ్జానాన్నిత‌ను చూసే సినిమాల‌ద్వారా ఎలా పొందాడ‌నేది ఇందులో కీల‌కం.   చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించిన మీనా- వెంకటేష్  భార్య పాత్రలో చక్కగా సరిపోయింది.10వ‌త‌ర‌గ‌తి ఫెయిల్ అయిన జ్యోతిగా మీనా న‌టించింది.  తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఎప్పటిలానే వెంకీ – మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కుటుంబాల్లో  ఉండే అల్ల‌రి చిలిపి స‌ర‌దాలు ఇందులో బాగానే ఉన్నాయి.అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించేలా నటించారు .అవినీతి పోలీసుగా ర‌వికాలే బాగా చేశాడు. ఐజీ గా న‌దియా చాలా బాగా చేసింది  . తల్లిగా,పోలీస్ అధికారిగా జీవించింది. ఆమె భర్త‌గా సీనియ‌ర్ నరేశ్ బాగా చేశాడు. వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, చైతన్య కృష్ణ, సమీర్,బెన‌ర్జీ, కాదంబ‌రికిర‌ణ్‌, చ‌ల‌ప‌తిరావు, అన్న‌పూర్ణ‌మ్మ‌ మిగిలిన పాత్ర‌లు చేసారు .

               ద‌ర్శ‌కురాలు  శ్రీ ప్రియ మళయాళ వెర్షన్ లోని సీన్స్ ని ' సేమ్  టు సేమ్'  దించినా- థ్రిల్లింగ్ మోమెంట్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యింది. అలాగే నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఇక సినిమాకి శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ మోమెంట్స్ కి అతను ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ లో ఉత్కంఠని మరింత పెంచింది . అలాగే ఎస్.  గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. సినిమా అంతా పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఆయన  మొదటి భాగం లో- మరి కాస్త  తగ్గించి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అలాగే జీటు జోసెఫ్ అందించిన కథ -కథనం, పరుచూరి బ్రదర్స్ రచన, డార్లింగ్ స్వామి డైలాగ్స్ కూడా బాగున్నాయి                               -రవళి 

0 comments:

Post a Comment