RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, July 20, 2012

రంగనాద్' నడత 'పుస్తకావిష్కరణ

రంగనాద్' నడత 'పుస్తకావిష్కరణ
మనిషి జీవితం లో 'నడత' కు  చాలా ప్రాముఖ్యత వుందని అక్కినేని నాగేశ్వర్ రావు అన్నారు. రవీంద్రభారతిలో ప్రముఖ నటుడు రంగనాద్ రచన' నడత' పుస్తకావిష్కరణ చేసిన అక్కినేని మాట్లాడుతూ -ప్రస్తుతం వక్ర మార్గంలో, విష పూరితమైన దిశలో పోతున్న సమాజానికి రంగనాద్ కవితలు కనువిప్పు కలిగించేలా వున్నాయని అన్నారు. 'యువకళావాహిని' ఆధ్వర్యం లో జరిగిన ఈ  కార్యక్రమంలో డా"కే .ఐ .వరప్రసాద్ రెడ్డి దంపతులకు రంగనాద్ తన కవితా సంపుటిని అంకితమిచ్చారు. రంగనాద్ ను అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాళ్ళ బండి కవితా ప్రసాద్,డా"సి.నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ,సారిపల్లి కొండల రావు,వేమూరి రామ కోటేశ్వర్ రావు, బైసా రామదాస్, క్రిష్ణ, వై.కే.నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. సభ ప్రారంభం లో రంగనాద్ చిత్రాల్లోని పాటలతో అందించిన ' గీతాలహరి' ప్రేక్షకులను అలరించింది.

0 comments:

Post a Comment