RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, October 14, 2011

'సీతాదేవి' నయనతారకూ తమిళ నాట ఆలయం

కుష్బూ, నమితలకు అప్పట్లో ఆలయాలు కట్టించారని తమిళనాట ప్రచారం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రభుదేవాతో జతకట్టనున్న నయనతారకు కూడా తమిళంలో ఆలయం కట్టించేందుకు కొంతమంది అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార దక్షిణాది సినిమాలన్నింటిలోనూ నటించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. త్వరలో నయనతార-ప్రభుదేవాలు పెళ్లిచేసుకోనున్నారు. తెలుగులో బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో కలిసి నయనతార ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీతాదేవి పాత్ర చేసింది . లేటెస్ట్‌గా ఆ చిత్రం తాలూకు నయనతార స్టిల్స్‌ కూడా.....

Wednesday, October 12, 2011

మాధురీ దీక్షిత్‌ స్వదేశ ఆగమనం

తన అందచందాలతో, హావభావాలతో బాలీవుడ్‌ను ఏలిన నాయికా మణుల్లో మాధురీ దీక్షిత్‌ ఒకరు. మాధురీ చేసే నాట్యమంటే అభిమానులు పడిచస్తారు. అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీరామ్‌ నెనేతో వివాహమైన తర్వాత అమెరికాకు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి పలు కార్యక్రమాల్లో, షూటింగ్స్‌లో పాల్గొనేది. రాను రాను ఇండియా వైపు ......

ఎన్నింటినో అధిగామించాను :జయప్రద

సహజ సౌందర్య రాశి..ఒకనాటి యువత కలల రాణి..నేటి యువ అందగత్తెల రోల్‌మోడల్..ఇంతలా చెబుతున్నారు ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు మన అడవిరాముడుతో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ చిందేసి..అక్కినేనితో మేఘసందేశం పంపిన నెరజాణ..మన జయప్రద..వయసు పెరిగినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం..1980 ప్రాంతంలో భారతీయ ప్రఖ్యాత నటులందరి సరసన నటించి మేటి నటిగా కీర్తి గడించిన జయప్రద ఇప్పటికీ....

Tuesday, October 11, 2011

ఇది ఏ 'నాయిక' జీవితం?

దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ చిత్రాన్ని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ చిత్రాల ద్వారా మూడుసార్లు జాతీయ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని.....

తెలుగు సినిమా రంగాన - బోగస్ రికార్డుల హంగామా


మంచి సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. మన తెలుగు సినిమా రంగం లో మాత్రం ....పెద్ద ఆర్టిస్టులతో స్థాయి లేని సినిమా తీసి , మీడియా లో హైప్ చేసి ఓపెనింగ్స్ భారీగా రాబట్టుకోవాలని చూస్తారు. అంతటితో సరిపెట్టుకోకుండా ....తెలుగు సినిమా చరిత్రలో రికార్డ్ వసూళ్లు- అంటూ భోగస్ అంకెలతో జనాన్ని గందర గోళం లోకి నెడుతున్నారు. మొదటి వారం వసూళ్ళ రికార్డ్ పోయి, మొదటి రోజు వసూళ్ళ రికార్డ్ ....మొదటి ఆట రికార్డ్ అంటూ.....

Saturday, October 8, 2011

అభిరుచి గల నిర్మాత రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Thursday, October 6, 2011

ఊసర వెల్లి' చిత్ర సమీక్ష

                                     ఊసర వెల్లి'  చిత్ర సమీక్ష         2/5                      

                            శ్రీ వెంకటేశ్వర  సిని చిత్ర పతాకం ఫై  సురేంద్ర రెడ్డి  దర్శకత్వం లో  భోగవల్లి ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మించారు.
            టోనీ డబ్బు కోసం ఏ పని కైనా సిద్ధ పడే చిల్లర దొంగ . ఓసారి  కాశ్మీర్ లో తీవ్రవాదుల చేతిలో బందీ అయిన టోనీ కి నీహారిక అనే అమ్మాయి పరిచయమై ఆ తర్వాత కనబడకుండా వెళ్లి పోతుంది.  ఆతర్వాత నీహారిక మరో చోట తారస పడటంతో ... ప్రేమ పేరుతో , స్నేహం పేరుతో టోనీ  వెంటపడుతుంటాడు. ఆక్రమంలో అజ్జూ భాయి అనే మాఫియా డాన్ మనుషులని చంపుతుంటాడు. అయితే , వారిని టోనీ  చంపుతూ పోవడానికి  ఒక బలమైన కారణం ఉందని ...ఒకరికి ఇచ్చిన మాటకోసం అలాచేస్తున్నాడని ఆ తర్వాత తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బాక్ లో నీహారికకు  కూడా ప్రధాన పాత్ర ఉంటుంది . అది ఏమిటి? బలమైన మాఫియా డాన్ అజ్జూ భాయి తో తల పడ్డ టోనీ ఎలా నెగ్గుకు రాగలిగాదనేది ఈ చిత్రం లో చూడాలి.
                          గతంలో ఎలాంటి సినిమాలు చేసినా ' కిక్' తో మంచి కమర్షియల్ దర్శకుడిగా  మారాడనిపించుకున్న సురేంద్ర రెడ్డి ఈ చిత్రం తో ఒకే సారి నాలుగు మెట్లు దిగజారాడు.   ఏ చిత్రాని కైనా  మంచి కధ , కొత్తదనం...వినోదం ఉన్నకధనం అవసరం.  అర్ధం లేని వక్కంతం వంశీ  కధతో,  గందరగోళం  స్క్రీన్ ప్లే  తో, ఏ ప్రత్యేకతలు లేకుండా  ఈ చిత్రం నిర్మించారు.   ట్విస్టులు, ఫైట్లు  ఎక్కువై పోయి ప్రేక్షకుడిని  చిర్రెత్తించాయి.   మాఫియా  సన్నివేశాలు  పరమ  రొటీన్ గా ఉన్నాయి.  హీరో  ఫై నే పూర్తిగా ఆధార పడ్డారు.  అయితే, హీరో పాత్రీకరణ' కిక్' లో రవితేజ లానే ఉండటం ...  ఆ స్త్తాయిలోపండక పోవడం మైనెస్ అయ్యింది.  ఉన్నంతలో యన్. టి. ఆర్ బాగానే చేసాడు. పాటల్లో, ఫైట్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం లో కొంతవరకూ  సఫలం అయ్యాడు. అయితే 'యమ దొంగ' కు ముందు అతని శరీరం లో  ఉన్న భారీ తనం మళ్ళీ కనిపించి అతని గ్లామర్ ని దెబ్బ తీసింది.  ఇంటర్ వెల్  ముందు ఇర్ఫాన్ ని చంపడం  , క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కృతకం గా ఉన్నాయి.    సినిమా ప్రారంభం లో కాసేపు బాగానే ఉందనిపించినా ....     ఆ తర్వాత సినిమాలో వినోదం శూన్యం .  దాని కోసం పెట్టిన  జయప్రకాష్ రెడ్డి - రఘు బాబు బృంద కామెడీ మరీ చప్పగా ఉంది. మంచి కామెడీ లేకపోవడం కూడా ఈ చిత్రం లో మరో పెద్ద లోపం.   తమన్నా నీహారిక గా కీలకమైన పాత్రని బాగా చేసింది.  అయితే ఆమె పాత్రలో ఉన్న మెలికలు, ప్రేక్షకుడి ని కూడా తికమక పెడతాయి. ఫ్లాష్ బాక్ లో  ఆమె హీరో నుండి 'వాగ్దానం'  తీసుకునే అత్యంత ప్రధానమైన సన్నివేశం కూడా పేలవం గా ఉంది.   అజ్జూ భాయి  గా ప్రకాష్ రాజ్ పాత పాత్రనే చేసాడు. శ్యాం ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తమన్నా స్నేహితురాలిగా పాయల్ ఘోష్ ,ఇతర పాత్రల్లో రెహమాన్ , భరణి, సయ్యాజి షిండే ,మురళి శర్మ         
         కొరటాల శివ సంభాషణల్లో పస లేదు. ' కరెంట్ స్థంభం కూడా సన్నగానే ఉంటుంది' వంటి డైలాగులు  నవ్వు తెప్పించాయి.ఇటీవల  తెలుగు లో దేవిశ్రీ ప్రసాద్ బలహీనమైన సంగీతం అందించిన చిత్రం ఇదే.  పాటలు ఆకట్టుకోలేక పోయాయి. రీ రికార్డింగ్ పరిస్థితి కూడా అదే. పాటల చిత్రీకరణ కూడా అంతంత మాత్రమే. రసూల్ చాయాగ్రహణం పర్వాలేదు. రాం లక్ష్మణ్ త్రిల్ల్స్ చెత్తగా ఉన్నాయి.